భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌గా వెంకీ, చైతు మల్టీస్టారర్ మూవీ

  • IndiaGlitz, [Tuesday,July 03 2018]

సీనియ‌ర్ క‌థానాయ‌కుడు విక్టరీ వెంకటేష్, యువ క‌థానాయ‌కుడు నాగ చైతన్య హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించ‌బోతున్న‌ ఈ సినిమాని సురేష్ బాబు, కోన వెంకట్‌తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోంది. తాజాగా.. ఈ సినిమాని భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌గా నిర్మిస్తున్నట్టు నిర్మాతలలో ఒకరైన సురేష్ బాబు అధికారికంగా వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి 'వెంకీ మామా' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. స్వతహాగా మామా అల్లుళ్ళైన వెంకీ, చైతు న‌టిస్తున్న ఈ సినిమాకి 'వెంకీ మామా' టైటిల్ అయితే బాగుంటుందని కొంతమంది అభిప్రాయప‌డుతున్నారు.

గ్రామీణ నేపథ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో హ్యూమా ఖురేషి, రకుల్ ప్రీత్ సింగ్‌ కథానాయికలుగా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మ‌రిన్ని విష‌యాలు తెలుస్తాయి.

More News

ఈ నగరానికి ఏమైంది సక్సెస్ మీట్

గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా ఫస్ట్ షో నుండి పాజిటివ్ టాక్ తో ప్రదర్శింపడుతుంది.

అనుప‌మ ఎంట్రీ సీన్ అదిరందంటున్న ద‌ర్శ‌కుడు

'తొలిప్రేమ'.. సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన దర్శకుడు ఎ.కరుణాకరన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను యూత్ ఐకాన్‌గా నిలబెడుతూ..

రీమేక్‌కు బ్రేక్ వేసిన ర‌వితేజ‌..

మాస్ మహారాజా రవితేజ, గోవా బ్యూటీ ఇలియానా జంటగా నటిస్తున్న చిత్రం 'అమర్ అక్బర్ ఆంటోనీ'. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు.

అగ‌ష్టు 15న విడుద‌లకానున్న‌ GA2 పిక్చ‌ర్స్ 'గీతగోవిందం'

అర్జున్ రెడ్డి చిత్రం తో స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌దేవ‌ర‌కొండ త‌న కెరీర్ స్టార్టింగ్ నుండి త‌న చిత్రాల్ని ప్ర‌మెట్ చేసుకునే విధానం కొత్త‌గా

న‌వీన్ చంద్ర కొత్త సినిమా అప్‌డేట్‌...

హీరో న‌వీన్ చంద్ర చాలా కాలంగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. అడ‌పా ద‌డ‌పా కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు. అయితే సోలో హీరోగా సినిమా చేయ‌బోతున్నాడు ఈ గ‌డ్డం హీరో.