తేజని గట్టెక్కించిన వెంకీ నిర్ణయం

  • IndiaGlitz, [Monday,January 22 2018]

విక్టరీ వెంకటేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన‌ గురు' సినిమా విడుదలై దాదాపు ఏడాది కావస్తోంది. ఈ చిత్రం తర్వాత వెంకీ క‌థానాయ‌కుడిగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో.. ఆటా నాదే వేటా నాదే' సినిమా ఈ పాటికే చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉండాల్సింది. గత నెలలో పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న‌ప్ప‌టికీ.. రెగ్యుల‌ర్ షూటింగ్ మాత్రం ఇంకా మొదలు కాలేదు. దీనికి కారణం.. బాలకృష్ణ, తేజ కలయికలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకోబోతున్న య‌న్‌.టి.ఆర్' మూవీ. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఈ సినిమా స్పెషల్ టీజర్‌ని విడుదల చేయడానికి నిర్ణయించారు బాలకృష్ణ.

ఈ టీజర్ చిత్రీకరణ వలన వెంకీ సినిమా విషయంలో కొంత జాప్యం జరిగింది. ఇప్పుడు య‌న్‌.టి.ఆర్' సినిమా పూర్తి చేయమని బాలయ్య నుంచి ఒత్తిడి పెరగడంతో ఎవరిని ఒప్పించాలో...ఎవరి సినిమా ముందుగా ప్రారంభించాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోయారు తేజ. అయితే ఈ విషయమై తేజకి ఊరటనిచ్చే సమాధానం.. వెంకీ నుంచి వచ్చిందని సమాచారం. ముందుగా య‌న్‌.టి.ఆర్' సినిమా పూర్తి చేసుకోమని వెంకీ చెప్పారట. తర్వాత తన సినిమా చేద్దామని చెప్పడంతో...తేజ ప్రస్తుతం య‌న్‌.టి.ఆర్' సినిమాని ప్రారంభించే పనిలో పడ్డారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే...ఈ గ్యాప్‌లో పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వెంకటేష్ ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం పూరీ త‌న త‌న‌యుడు ఆకాష్‌తో 'మెహ‌బూబా' చేస్తున్న విష‌యం తెలిసిందే.

More News

ఏడు భాషల్లో అల్లు అర్జున్ సందడి

'ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు'..ఈ మాట స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కి సరిగ్గా సరిపోతుంది.

వాలీబాల్ ఆట నేపథ్యంలో..

బెల్లంకొండ శ్రీనివాస్..నటించింది మూడు సినిమాలే అయినా తనకంటూ ఒక ఇమేజ్ ని సొంతం చేసుకున్న యువ కథానాయకుడు.

మార్చిలో 'టాక్సీవాలా'

సంచ‌ల‌న విజ‌యం సాధించిన 'అర్జున్ రెడ్డి' సినిమా తర్వాత.. ఆ చిత్ర క‌థానాయ‌కుడు విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం ఎప్పుడు వస్తుందా అని అత‌ని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్ర‌స్తుతం విజ‌య్ అర‌డ‌జ‌ను చిత్రాల‌తో బిజీగా ఉన్నా.. వీటిలో 'టాక్సీవాలా' ముందుగా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

మళ్ళీ బాలయ్య తోనే..

కొన్ని హిట్ కాంబినేషన్లు వెండితెరపై రిపీట్ అయితే చాలు..సినిమా ఫలితం గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు.

వెంకీ త‌మ్ముడిగా రోహిత్‌?

సీనియ‌ర్ క‌థానాయ‌కుడు వెంక‌టేష్ హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం.. అతి త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.