విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు

  • IndiaGlitz, [Sunday,April 29 2018]

విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ  2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ఎంటర్ టైన్మెంట్ విష్ణు బొప్పన ప్రతి ఏడాది లాగే ఈ ఏడాదికి సంబందించిన సినిమా తరాల డైరీ ఆవిష్కరణ జరిగింది.

ఈ కార్యక్రమం ఆదివారం ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించారు. పలువురు సినీ నటీనటుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. 2018 కి సంబందించిన డైరీని నిర్మాత సుఖీభవ ఫిలిమ్స్ అధినేత గురురాజ్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో గురురాజ్ మాట్లాడుతూ .. విష్ణు బొప్పన  చేపట్టిన ఈ కార్యక్రమం ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉంది. సినిమా వాళ్లకు సంబందించిన విలువైన సమాచారంతో ప్రతి ఏడాది ఈ డైరీని రూపొందిస్తున్నాడు. 2014 నుండి టివి అవార్డులు అందిస్తున్న ఈ సంస్థ ఈ ఏడాది నుండి సినిమా అవార్డులు అందించేందుకు సిద్ధం అయింది.

ఇలాంటి అవార్డుల కార్యక్రమం ద్వారా నటీనటులను టెక్నీషియన్స్ ను ప్రోత్సహించినట్టు అవుతుంది. విష్ణు చేస్తున్న కార్యక్రమానికి చాలా మంది స్పాన్సర్లు రావడం బట్టి చుస్తే అయన చేస్తున్న కార్యక్రమం ఎంత గొప్పతో తెలుస్తుంది. తప్పకుండా ఆయనకు నా సపోర్ట్ ఉంటుంది అన్నారు.

విబి ఎంటర్ టైన్మెంట్ అధినేత  విష్ణు బొప్పన మాట్లాడుతూ .. ఈ కార్యక్రమానికి  వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇప్పటి వరకు సినిమా టివి డైరెక్టరీని 2014 నుండి ప్రచురిస్తున్నాం. అలాగే 2014 నుండి బుల్లితెర అవార్డులు అందిస్తూ వస్తున్నాం.

ఈ రోజు 2018 ఫీల్ అండ్ టివి డైరెక్టరీ ని విడుదల చేసాం.  ఈ ఏడాది నుండి వెండితెర అవార్డులను అందించాలని నిర్ణయం తీసుకున్నాం. నాకు సపోర్ట్ అందిస్తున్న స్పాన్సర్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. వారు నాకు తోడుగా ఉన్నారు కాబట్టి నేను ఈ కార్యక్రమాలను చేస్తున్నాను అన్నారు.  

More News

చ‌ర‌ణ్ చిత్రంలో సుదీప్‌?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వాని జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యాక్షన్ చిత్రాల‌ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

'యాత్ర'లో 'బాహుబలి 2' యాక్ట్ర‌స్‌

సమైక్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌గా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

'యముడికి మొగుడు'కి 30 ఏళ్ళు

ధర్మాన్ని పాటించే యమధర్మరాజు తప్పు చేస్తే ఎలా ఉంటుంది అన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రమే 'యముడికి మొగుడు'.

ర‌వితేజ హీరోయిన్ వైపే మొగ్గు చూపుతున్న రామ్‌

ఎన‌ర్జిటిక్‌ స్టార్ రామ్ హీరోగా పి.ఎస్‌.వి. గ‌రుడ‌వేగ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న‌ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

వెంకీతో కామెడీ చేయ‌నున్న అన‌సూయ‌

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకులుగా  'ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' పేరుతో ఓ మల్టీస్టారర్ మూవీ  తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.