వరుణ్ తేజ్ - శేఖర్ కమ్ముల- దిల్ రాజు చిత్రం షూటింగ్ రేపు ప్రారంభం

  • IndiaGlitz, [Thursday,August 04 2016]

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దర్శకుడు శేఖర్ కమ్ముల,నిర్మాత దిల్ రాజు కలయికలో ఒక చక్కటి ప్రేమ కథా చిత్రం రూపొందనుంది. మాలర్ ఫేమ్ సాయి పల్లవి ఈ చిత్రం లో హీరోయిన్. ఈ చిత్రం షూటింగ్ రేపు (ఆగస్టు 5) నిజామాబాద్ జిల్లా లో బాన్స్వాడ లో ప్రారంభం అవుతుంది.
రేపు ఉదయం 9:30 నిమిషాలకు ఈ చిత్రం టైటిల్ ను, థీమ్ పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఒక అమెరికా అబ్బాయి, తెలంగాణా అమ్మాయి కి మధ్య జరిగే ప్రేమ కథే ఈ చిత్రం.
ఈ చిత్రానికి ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫి విజయ్ కుమార్, సంగీతం శక్తి కాంత్ అందిస్తారు. ఇతర తారాగణం, మరియు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే విడుదల చేస్తాం అని చిత్ర బృందం తెలిపింది.

More News

హాట్ టాపిక్ గా మారిన రాజ‌మౌళి రెమ్యూన‌రేష‌న్

ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. ఈ సంచ‌ల‌న చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 600 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి చ‌రిత్ర సృష్టించింది. దీంతో బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

తొలిసారి చార్మినార్ ను సందర్శించిన స్టార్ హీరో..!

తొలిసారి చార్మినార్ ను సందర్శించిన స్టార్ హీరో ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

ఈనెల‌ 12 న ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోన్న భారీ చిత్రం జనతా గ్యారేజ్ . ఎన్టీఆర్ సరసన స‌మంత‌, నిత్యా మీనన్ లు కథానాయికలు గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్రఖ్యాత మల‌యాళ నటుడు మోహన్ లాల్  ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.

నిఖిల్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుందట...!

ఇంతకీ పెళ్లి చేసుకోబోతున్న నిఖిల్ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా..?కలర్స్ స్వాతి.

చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే ఆడియో విడుదల

పవన్,సోనియా దీప్తి హీరో,హీరోయిన్లుగా పి.ఆర్.మూవీ మేకర్స్ బ్యానర్ పై సంతోష్ నెలంటి దర్శకత్వంలో సోని పవన్,రజిని గట్టు నిర్మించిన చిత్రం చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే.