'కంచె' తర్వాత వరుణ్ సినిమా ఇదే..

  • IndiaGlitz, [Tuesday,October 20 2015]

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం కంచె. ఈ చిత్రాన్ని క్రిష్ తెర‌కెక్కించారు. ద‌స‌రా కానుక‌గా ఈనెల 22న కంచె చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధం నేప‌ధ్యంతో రూపొందిన కంచె ఖ‌చ్చితంగా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధిస్తుంద‌ని చిత్ర యూనిట్ న‌మ్మ‌కంతో ఉన్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...వ‌రుణ్ తేజ్ వీరు పోట్ల‌తో సినిమా చేయ‌నున్నాడ‌ని స‌మాచారం. ఈ చిత్రాన్ని న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి నిర్మించ‌నున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి క‌ధాచ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ మూవీని ఎనౌన్స్ చేస్తార‌ట‌. మ‌రి...బిందాస్, ర‌గ‌డ‌, దూసుకెళ్తా...ఇలా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్స్ అందించిన వీరు పోట్ల వ‌రుణ్ తేజ్ తో ఎలాంటి మూవీ చేయ‌నున్నాడో..? చూడాలి.