విశాల్‌పై వ‌ర్మ‌ల‌క్ష్మి ఘాటు వ్యాఖ్య‌లు

  • IndiaGlitz, [Friday,June 14 2019]

హీరో, న‌డిగ‌ర్ సంఘం అధ్య‌క్షుడు విశాల్‌పై వ‌ర‌లక్ష్మి శ‌ర‌త్‌కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. అందుకు త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌ను వేదిక‌గా చేసుకున్నారామె. మరి స్నేహితుడు విశాల్‌ను వ‌ర‌లక్ష్మి టార్గెట్ చేయ‌డం వెనుక కార‌ణ‌మేంటి? అనే సందేహాలు త‌లెత్త‌క మాన‌వు.

వివ‌రాల్లోకెళ్తే.. ఈ నెల 23న జ‌ర‌గ‌బోయే న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని మాజీ న‌డిగ‌ర్ సంఘం అధ్య‌క్షుడు, హీరో శ‌ర‌త్‌కుమార్‌పై విశాల్ ఆరోప‌ణ‌లు చేశారు. తండ్రిపై ఆరోప‌ణ‌లు చేసిన విశాల్‌పై వ‌ర‌లక్ష్మి బాగా ఫైర్ అయ్యింది.

'నువ్వు ఇలా దిగ‌జారుతావ‌ని అనుకోలేదు. నువ్వు పెరిగిన వాతావ‌ర‌ణ‌మే అందుకు కార‌ణ‌మేమో. నువ్వు న‌డిగ‌ర్ సంఘం అధ్య‌క్షుడిగా ఏం ప‌నులు చేశావో దాన్ని చెప్పుకో.. అంతే కానీ.. నా తండ్రిని అన‌వ‌స‌రంగా గొడ‌వ‌ల్లోకి ఎందుకు లాగుతావు? ఒక‌వేళ నిజంగా నా తండ్రి త‌ప్పు చేసుంటే చ‌ట్టం ఆయ‌న‌కి శిక్ష వేస్తుంది. స్నేహితురాలిగా నీకెంతో మ‌ద్ద‌తుని ఇచ్చాను. ఇప్ప‌టి నుండి ఇవ్వ‌ను. నా ఓటుని పొగొట్టుకున్నావు అంటూ వ‌ర‌ల‌క్ష్మి తెలిపారు.

More News

విజ‌య‌వాడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా: రాజ్ త‌రుణ్

రీసెంట్‌గా సోష‌ల్ మీడియా చాట్‌లో తాను ప్రేమ వివాహం చేసుకుంటున్నాన‌ని, త్వ‌ర‌లోనే త‌న పెళ్లి క‌బురు చెబుతాన‌ని హీరో రాజ్‌త‌రుణ్ తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే.

సూప‌ర్‌స్టార్‌తో న‌టించాల‌నుందంటున్న హాలీవుడ్ యాక్ట‌ర్‌

ఇటీవ‌ల మ‌హ‌ర్షి విడుద‌లైన‌ప్పుడు ఆ సినిమాను ఆకాశానికెత్తేస్తూ.. మహేష్‌, వంశీ పైడిప‌ల్లి అమెరికా వ‌స్తే త‌న‌ను క‌ల‌వాలంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశారు హాలీవుడ్ యాక్ట‌ర్ బిల్ డ్యూక్‌.

టీడీపీకి పట్టిన గతే టీఆర్ఎస్‌కు.. అందుకే జగన్‌తో స్నేహం!

2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ ఓటమిపై ఇప్పటికీ ఎంత వెతికినా కారణాలు మాత్రం తెలియట్లేదు.

మాల్దీవ్స్‌లో పాట చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న 'ఇస్మార్ట్ శంక‌ర్‌'

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్‌`.

2024లో జగన్‌పై గెలిచేందుకు ‘పీకే’తో టీడీపీ డీల్!

టైటిల్ చూడగానే కాసింత ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ.. అవును మీరు వింటున్నది నిజమే.. 2019 ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్..