హైదరాబాద్ ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం

  • IndiaGlitz, [Saturday,March 20 2021]

నాలుగు రోజుల ఉత్కంఠకు తెరపడింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ప్రధాని పీవీ కుమార్తె సురభి వాణీదేవి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓటుతో ఆమె ఈ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావుపై మొదటి నుంచి వాణీదేవి ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. చివరకు వాణీదేవి విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 17న ప్రారంభమైంది. నాలుగు రోజుల సుదీర్ఘంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగిన అనంతరం ఫలితం వాణీదేవికి అనుకూలంగా వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థిని వాణీదేవికి 1,28,010 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రామచందర్ రావుకి 1,19,198 ఓట్లు వచ్చాయి.

తొలి ప్రాధాన్యతా ఓట్లలో ఎవరికీ విజయం దక్కలేదు. దీంతో మొత్తం 91 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌ చేశారు. తొలి ప్రాధాన్యతగా వాణీదేవికి 1,12,689 ఓట్లు రాగా.. 36,580 రెండో ప్రాధాన్యతా ఓట్లు వచ్చాయి. దీంతో మొత్తంగా ఆమెకు 1,49,249 ఓట్లు వచ్చాయి. వాణీదేవి విజయం సాధించాలంటే 19,251 ఓట్లు రావాల్సి ఉంది. అలాగే ఎవరికీ కోటాకు అవసరమైన ఓట్లు రాకపోవడంతో బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ ప్రక్రియను అధికారులు ప్రారంభించినట్టు సమాచారం. ఆయన ఓట్లలో రెండో ప్రాధాన్యతగా వచ్చిన ఓట్లను ఆమె ఖాతాలో వేయనున్నారు. వాణీదేవి విజయాన్ని మరికాసేపట్లో అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు.

More News

అడివి శేష్‌ హీరోగా 'హిట్‌ 2'.. లాంఛనంగా ప్రారంభం

కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయడానికి, కొత్త కాన్సెప్ట్‌ సినిమాలను తెరకెక్కించడానికి నిర్మాణంలో భాగమైన హీరో నాని వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై

'పీన‌ట్ డైమండ్' టీజర్ విడుదల చేసిన ప్రొడ్యూసర్ దిల్ రాజు ..!!

అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌  ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త?

తెలంగాణలో కాక రేపుతున్న వేతన సవరణ అంశానికి మరో రెండు రోజుల్లో తెరపడనుంది.

కమల్‌కు షాక్.. అవినీతి ఆరోపణలతో అడ్డంగా బుక్కైన పార్టీ కార్యదర్శి

తమిళనాడులో పొలిటికల్ హీట్ రోజు రోజుకూ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వ్యూహాలు, ప్రతివ్యూహాలతో పార్టీలు ముందుకు సాగుతున్నాయి.

నా దగ్గర 8.55 కిలోల బంగారం ఉంది: ఖుష్బూ

తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్ హడావుడి కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ తరుఫున ప్రముఖ సినీ నటి ఖుష్బూ థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.