వంగవీటి పై డిజిపికి ఫిర్యాదు చేసిన వంగవీటి రాధా..!

  • IndiaGlitz, [Saturday,December 24 2016]

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన సంచల‌న చిత్రం వంగ‌వీటి. విజ‌య‌వాడలో జ‌రిగిన య‌ధార్ధ సంఘ‌ట‌న‌లు ఆధారంగా రూపొందించిన వంగ‌వీటి ఈనెల 23న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా రిలీజ్ ముందు వ‌ర్మ విజ‌య‌వాడ వెళ్లి వంగ‌వీటి కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసిన విష‌యం తెలిసిందే.
అయితే...నిన్న రిలీజ్ అయిన వంగ‌వీటి సినిమాకు మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. ఇదిలా ఉంటే...ఈ చిత్రంలో అభ్యంత‌క‌ర స‌న్నివేశాలు ఉన్నాయి అంటూ మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా ఏ.పి డిజిపి సాంబ‌శివ‌రావుకు ఫిర్యాదు చేసారు. సినిమా రిలీజ్ కు ముందు వ‌ర్మ‌తో త‌మ అభ్యంత‌రాలు చెప్పిన‌ప్ప‌టికీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌ని రాధా అన్నారు. ఈ సినిమాలోని అభ్యంత‌ర స‌న్నివేశాల‌ను వెంట‌నే తొల‌గించాలి అని ఫిర్యాదులో పేర్కొన్నారు.