పూరీ బాట‌లో వంశీ కూడా వెళ‌తారా?

  • IndiaGlitz, [Thursday,May 10 2018]

పూరి జగన్నాథ్, కృష్ణవంశీ, శ్రీనువైట్ల, సుకుమార్ ఈ నలుగురు దర్శకులకి సంబంధించి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే.. అగ్ర క‌థానాయ‌కులు మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ .. ఇలా ఈ ముగ్గురుతోనూ సినిమాలు చేసిన దర్శకులు వీరు. అయితే.. ఈ ముగ్గురితోనూ విజయాలను అందుకున్న డైరెక్టర్ మాత్రం పూరి జగన్నాథ్ మాత్ర‌మే. మహేశ్‌తో ‘పోకిరి’, ఎన్టీఆర్‌తో ‘టెంపర్’, చరణ్‌తో ‘చిరుత’ సినిమాలు చేసి ఆయ‌న‌ విజయాలను అందుకున్నారు.

ఈ నలుగురు ద‌ర్శ‌కుల‌తో పాటు ఈ ముగ్గురి హీరోలతో సినిమాలు చేసిన దర్శకుడిగా వంశీ పైడిపల్లి కూడా చేరనున్నారు. ఇప్ప‌టికే.. ఈ దర్శకుడు  ఎన్టీఆర్‌తో ‘బృందావనం’, చరణ్‌తో ‘ఎవడు’ సినిమాలను చేసి మంచి విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం మహేశ్ 25వ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు వంశీ. అమెరికా నేపథ్యంలో సాగే ఈ సినిమాకి అశ్వనీదత్, దిల్ రాజు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మ‌రి.. ఎన్టీఆర్, చరణ్‌తో  హిట్స్‌ను అందుకున్న వంశీ  మహేశ్‌తో కూడా విజయాన్ని అందుకుని.. పూరి జగన్నాథ్ సరసన నిలుస్తారో, లేదో చూడాలి.

More News

కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో చిరు?

మిర్చి చిత్రంతో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసిన ర‌చ‌యిత కొర‌టాల శివ‌.. తొలి ప్ర‌యత్నంలోనే విజ‌యం అందుకున్నారు.

రెండో రేసు గుర్రం వ‌స్తోందా?

రేసు గుర్రం.. 2014 వేస‌వికి విడుద‌లై ఆ ఏడాదిలోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిలిచిన మూవీ ఇది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమాకి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ప‌ద‌హారేళ్ళు పూర్తి చేసుకున్న అల్ల‌రి న‌రేశ్‌

హాస్య ప్ర‌ధాన చిత్రాల‌కు చిరునామాలా నిలిచిన ఈ త‌రం హాస్య క‌థానాయ‌కుడు అల్ల‌రి న‌రేశ్‌. ఒక టైమ్‌లో మినిమ‌మ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న న‌రేశ్‌.. వ‌రుస సినిమాలు చేస్తూ వార్తల్లో నిలిచారు.

సుమంత్ అశ్విన్ హీరోగా ప్రొడక్షన్ నెం.3 'ప్రేమ కథా చిత్రం 2' ప్రారంభం

ప్రేమ కథా చిత్రం, జక్కన్న వంటి బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ తో

'రంగస్థలం' కాంబో రిపీట్ చేస్తుందా?

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.