అలా..చేస్తే త‌ప్పు ఏమిటి అంటున్న వంశీ పైడిప‌ల్లి..

  • IndiaGlitz, [Thursday,March 24 2016]

మున్నా చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై...తొలి చిత్రంతో విజ‌యం సాధించ‌లేక‌పోయినా బృందావ‌నం, ఎవ‌డు చిత్రాల‌తో స‌క్సెస్ సాధించిన డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి. తాజాగా నాగార్జున - కార్తీ - త‌మ‌న్నా కాంబినేష‌న్లో ఊపిరి చిత్రాన్ని తెర‌కెక్కించారు. రేపు ఊపిరి ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇదిలా ఉంటే...వంశీ ఎవ‌డు చిత్రాన్ని హాలీవుడ్ మూవీ ఫేస్ ఆఫ్ చిత్రం ఆధారంగా తెర‌కెక్కించారు.

ఊపిరి చిత్రాన్ని ఫ్రెంచ్ ఫిల్మ్ ఇన్ ట‌చ్ బుల్స్ ఆధారంగా తెర‌కెక్కించారు. హాలీవుడ్ మూవీస్ ఆధారంగా సినిమాలు తెర‌కెక్కిస్తున్నారు. ఎందుకిలా...అని అడిగితే..ఎవ‌డు సినిమా తీస్తున్న‌ప్పుడు ఫేస్ ఆఫ్ అనే సినిమా ఉంద‌ని నాకు అస‌లు తెలియ‌దు. ఎవ‌డు అనేది ఓ త‌ల్లి ఎమోష‌నల్గా తీసుకున్న నిర్ణ‌యం వ‌ల‌న జ‌రిగే క‌థ‌. అయినా...హాలీవుడ్ మూవీ వ‌ల‌న ఇన్ స్పైయిర్ అయితే త‌ప్పు ఏమిటి..? అని అంటున్నాడు వంశీ. మ‌రి... హాలీవుడ్ మూవీస్ తో ఇన్ స్పైయిర్ అయి ఇక నుంచి కూడా ఇలాగే సినిమాలు తెర‌కెక్కిస్తాడో...లేక సొంత క‌థ‌ల‌తో సినిమాలు తీస్తాడో చూడాలి.

More News

చిరు - నాగ్ త‌ర్వాతే బాల‌య్య‌..

మెగాస్టార్ చిరంజీవి - కింగ్ నాగార్జున త‌ర్వాతే న‌ట‌సింహం బాల‌య్య‌. ఇంత‌కీ ఏ విష‌యంలో అనుకుంటున్నారా...ఇండియా టుడే క‌వ‌ర్ పేజీ పై  బాల‌య్య లెజండ‌రీ పోస్ట‌ర్ వ‌చ్చింది. ఈ స్పెష‌ల్ ఎడిష‌న్ కి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఈరోజు 3 గంట‌ల‌కు స‌చివాల‌యంలో విడుద‌ల చేయ‌నున్నారు.

చైతు మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

నాగ చైత‌న్య హీరోగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపో. ఈ చిత్రంలో చైతు స‌ర‌స‌న మంజిమా మోహ‌న్ న‌టిస్తున్నారు. ఈ చిత్రం పాట‌లు మిన‌హా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సావిత్రి'

యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తెచ్చుకున్న వారిలో నారా రోహిత్ ఒకరు. తొలి చిత్రం బాణం నుండి విభిన్నమైన కథలు ఎంపికలో కొత్తవాళ్ళకి చాన్స్ ఇవ్వటం లో నారా రోహిత్ ఎప్పుడు ముందుంటున్నారు.

బాలీవుడ్ లో ఊపిరి

నాగార్జున - కార్తీ - త‌మ‌న్నా కాంబినేష‌న్లో రూపొందిన క్రేజీ భారీ మ‌ల్టీస్టార‌ర్ ఊపిరి. ఈ చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించారు. పి.వి.పి సంస్థ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఊపిరి చిత్రాన్ని నిర్మించింది.

ముంబాయిలో స‌ర్ధార్ ఆడియో 

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా రిలీజ్ అవుతుంది. బాలీవుడ్ లో 800 ధియేట‌ర్స్ లో స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ రిలీజ్ అవుతుండ‌డం విశేషం.