డ‌బ్బింగ్ షురూ చేసిన ‘వ‌కీల్ సాబ్‌’

  • IndiaGlitz, [Tuesday,March 23 2021]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. బాలీవుడ్ చిత్రం పింక్‌కు ఇది రీమేక్ అనే సంగ‌తి అందరికీ తెలిసిందే. బాలీవుడ్‌తో పోల్చితే దాదాపు డెబ్బై శాతం క‌థ‌లో చాలా మార్పులు, చేర్పులు చేసి సినిమాను తెర‌కెక్కించారు. ఏప్రిల్ 9న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా డ‌బ్బింగ్‌ను ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్టార్ట్ చేశాడు. సినిమాకు ఇక రెండు వారాల మాత్ర‌మే గ‌డువు ఉంది. ప‌వ‌న్ డ‌బ్బింగ్ చెప్పే వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. మార్చి 29న ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కానుంది. అలాగే ఏప్రిల్ 3న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేశారు నిర్మాత‌లు. ఈ వేడుక‌కు చిరంజీవి, చ‌ర‌ణ్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌వుతార‌ని స‌మాచారం.

ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో శ్రుతిహాస‌న్ అతిథి పాత్ర‌లో న‌టించగా అంజ‌లి, నివేదా థామ‌స్‌, అన‌న్య నాగ‌ళ్ల కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ ఫుల్ స్వింగ్‌లో కొన‌సాగుతున్నాయి.

More News

‘అణ్ణాత్త’ షూటింగ్ షురూ..!

ఎట్ట‌కేల‌కు సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ 168వ చిత్రం ‘అణ్ణాత్త’ షూటింగ్ రీస్టార్ట్ అయ్యింది. నిజానికి ఈ సినిమా త‌ర్వాత పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వాల‌నుకున్న ర‌జినీకాంత్

అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు: ఈటల

కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చిందని అంతా రిలాక్స్ అవుతున్న తరుణంలో మరోసారి విజృంభిస్తోంది.

బాలీవుడ్ బ్యూటీతో వైష్ణ‌వ్ తేజ్‌..!

తొలి చిత్రం ‘ఉప్పెన‌’తో సెన్సేష‌న‌ల్ హిట్ అందుకున్న యంగ్ హీరో వైష్ణ‌వ్ తేజ్‌. వందకోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి ‘ఉప్పెన’

‘తలైవి’ ట్రైలర్ : బొమ్మ బ్లాక్ బస్టరే..!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ జయలలిత బయోపిక్‌‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘తలైవి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న

సూర్యాపేట కబడ్డీ పోటీల్లో అపశృతి.. 100 మందికి గాయాలు

సూర్యాపేటలో 47వ జాతీయ స్థాయి కబడ్డీ ప్రారంభోత్సవంలో  అపశ్రుతి చోటుచేసుకుంది.