`వ‌కీల్‌సాబ్` రాక ఖ‌రారైన‌ట్లే..!

  • IndiaGlitz, [Tuesday,November 03 2020]

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత న‌టిస్తోన్న తొలి చిత్రం ‘వ‌కీల్‌సాబ్‌’. బాలీవుడ్ చిత్రం ‘పింక్‌’కు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప‌వ‌న్ లాయ‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. నివేదా థామ‌స్‌, అంజ‌లి ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. లాయర్ గా పవన్ చేస్తున్న తొలి చిత్రమిదే కావడం విశేషం. వేణుశ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం కోవిడ్ కార‌ణంగా హోల్డ్‌లో ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల 'వకీల్‌సాబ్‌' షూటింగ్‌ను రీస్టార్ట్‌ చేశారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా సెట్స్‌లోకి అడుగు పెట్టేశారు.

ఈ షెడ్యూల్ 11 రోజుల పాటు జ‌ర‌గ‌నుంది. దీంతో చిత్రీక‌ర‌ణంతా పూర్త‌యిన‌ట్లే. పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేయాల్సి ఉంటాయి. దీంతో సినిమాను నిర్మాత‌లు సంక్రాంతి బ‌రిలోకి దింప‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. 2021 స‌క్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న వ‌కీల్‌సాబ్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డం ఖాయ‌మైన‌ట్లేన‌ట‌. ఇక అదికారిక స‌మాచారం మాత్ర‌మే మిగిలి ఉంది. తెలుగులో ఈ చిత్రాన్ని బోనీక‌పూర్‌, దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దీని తర్వాత .. ప‌వ‌న్ మ‌ల‌యాళ రీమేక్ 'అయ్యప్పనుమ్‌ కోశియనుమ్' న‌టిస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

More News

బాల‌య్య సినిమాలో మ‌రో హీరోయిన్ ఎవ‌రంటే..?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో మూడో చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

పోలవరం ప్రాజెక్ట్ విషయమై కేంద్ర ఆర్థిక శాఖ గుడ్ న్యూస్..

పోలవరం ప్రాజెక్ట్ విషయమై కేంద్ర ఆర్థిక శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.

‘ఐ రిటైర్’ అంటూ షాక్ ఇచ్చిన బ్యాడ్మింటన్ స్టార్ సింధు..

‘ఐ రిటైర్’అన్న ట్వీట్‌తో ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ అభిమానులు షాక్‌కి గురి చేసింది. ఆమె రిటైర్ అవ్వడమేంటని ట్వీట్ చూసిన నెటిజన్లంతా షాక్ అయ్యారు.

'మిస్‌ ఇండియా' .. ఒప్పుకోవడానికి కారణమదే: కీర్తిసురేశ్‌

‘మహానటి’ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించుకున్న స్టార్‌ హీరోయిన్‌ కీర్తిసురేశ్‌.

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ‘అతిథి’ హీరోయిన్..

సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన ‘అతిథి’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అమృతా రావు ఆదివారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.