‘వకీల్‌సాబ్’ అప్పుడేనా?

  • IndiaGlitz, [Tuesday,October 06 2020]

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత న‌టిస్తోన్న తొలి చిత్రం ‘వ‌కీల్‌సాబ్‌’. బాలీవుడ్ చిత్రం ‘పింక్‌’కు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప‌వ‌న్ లాయ‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. నివేదా థామ‌స్‌, అంజ‌లి ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కాగా.. కోవిడ్ ప్ర‌భావంతో ఆగిన ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెల చివ‌రి వారంలో ప్రారంభించ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

లేటెస్ట్ స‌మాచారం మేర‌కు అక్టోబ‌ర్ 27 నుండి షూటింగ్‌లో పాల్గొంటార‌ట‌. ఇర‌వై రోజుల కాల్షీట్‌ను మాత్ర‌మే ప‌వ‌న్ కేటాయించార‌ట‌. అందుకు నిర్మాత‌లు కూడా ఒప్పుకున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ‘వ‌కీల్‌సాబ్’ సినిమా షూటింగ్ ఎన‌భై శాతం పూర్త‌య్యింది. ఈ సినిమాను త్వ‌ర‌గా పూర్తి చేస్తే కానీ.. ప‌వ‌న్ మ‌రో సినిమా సెట్స్‌లోకి వెళ్ల‌లేడు. ‘వ‌కీల్‌సాబ్‌’ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేసేలా నిర్మాత‌లు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే క్రిష్ జాగర్ల‌మూడి, హ‌రీశ్‌శంక‌ర్‌, సురేంద‌ర్ రెడ్డి, మ‌ధ్యలో ‘అయ్య‌ప్పనుమ్ కోశియుమ్’ రీమేక్‌లోనూ ప‌వ‌న్‌న‌టించాల్సి ఉంది. మ‌రి ఈ సినిమాల‌ను ప‌వ‌న్ ఎప్ప‌టికీ పూర్తి చేస్తారోనని ప్రేక్ష‌కాభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

More News

బాల‌య్య కూడా రెడీ అన్నాడా..?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మూడో మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

జనసేనానిని కలిసిన సుదీప్.. ఆసక్తికర విషయం ఏంటంటే..

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారితో ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశారు.

వైద్యుల మాట వినకుండానే ట్రంప్ డిశ్చార్జ్ అయ్యారట..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను చికిత్స పొందుతున్న వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

థియేటర్స్ కు కేంద్ర ప్రభుత్వం సూచించిన నిబంధనలు...

కోవిడ్‌ ప్రభావంతో సినిమా రంగం కుదేలైంది. ఆరు నెలలు థియేటర్స్‌ మూతపడ్డాయి. సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి.

పుకార్లకు క్లారిటీతో చెక్‌ పెట్టిన శృతిహాసన్‌

రీసెంట్‌గా శ్రుతి హాసన్‌ ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. దాని తర్వాత శ్రుతి హాసన్‌ దక్షిణాది సినిమాలను తక్కువగా మాట్లాడిందంటూ వార్తలు వినిపించాయి.