నాని రిజెక్ట్ చేసిన ప్రాజెక్టును ఓకే చేసిన వైష్ణవ్!

  • IndiaGlitz, [Saturday,February 27 2021]

‘ఉప్పెన’ సినిమా లాక్‌డౌన్ తరువాత.. 100 శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం అవకాశం ఇచ్చిన అనంతరం విడుదలైన సినిమా. ఏ ముహూర్తాన ఈ సినిమాకు దర్శకుడు బుచ్చిబాబు ‘ఉప్పెన’ అనే టైటిల్ ఫిక్స్ చేశారో కానీ ఈ సినిమా నిజంగా ఉప్పెనలాగే వసూళ్లను సాధించింది. ఈ సినిమాలో హీరోహీరోయిన్లకు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా హీరో వైష్ణవ్ మరో అవకాశాన్ని చేజిక్కించుకున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని రిజెక్ట్ చేయడంతో వైష్ణవ్‌కు అవకాశం దక్కిందని తెలుస్తోంది.

ఒకప్పటిలా కాదు.. సీన్ మారిందిప్పుడు. గతంలో ఒక హీరోను అనుకుని కథ రాస్తే.. ఒకవేళ దానిని సదరు హీరో రిజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ అటకెక్కేది. ఇప్పుడు అలా కాదు.. మరో హీరోకు కథను వినిపించి దర్శకనిర్మాతలు ఓకే చేసుకుంటున్నారు. అలా నాని రిజెక్ట్ చేసిన ఓ కథను హీరో వైష్ణవ్‌ తేజ్‌ అంగీకరించినట్టు తెలుస్తోంది. తాజాగా నిర్మాత భోగవల్లి ప్రసాద్‌ కొత్త దర్శకుడితో ఓ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. యాక్షన్‌ ఓరియెంటెడ్‌గా ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం.

అయితే నాని ఈ కథను రిజెక్ట్‌ చేశాడట. వైష్ణవ్ ‘ఉప్పెన’తో మంచి పేరు తెచ్చుకుని ఉండటంతో వెంటనే ఈ స్టోరీని ఆయనకు దర్శకుడు వినిపించినట్టు సమాచారం. వెంటనే వైష్ణవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. త్వరలోనే ఇది పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ఇప్పటికే డైరెక్టర్‌ క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జంగిల్‌ బుక్’‌ సినిమాను వైష్ణవ్ పూర్తి చేశాడు. తరువాత అన్నపూర్ణ బ్యానర్‌లో ఓ చిత్రం.. దాని తర్వాత భోగవల్లి ప్రసాద్‌ బ్యానర్‌లో తెరకెక్కించే చిత్రాల్లో నటించనున్నాడు. మరి నాని రిజెక్ట్ చేసిన సినిమా వైష్ణవ్‌కు ఎంత మేర కలిసొస్తుందో చూడాలి.

More News

పవన్ చిత్రంతోనే తిరిగి సినీ ప్రయాణం ప్రారంభిస్తున్నా: ఆనంద్ సాయి

యాదాద్రి ఆలయం నిర్మాణంలో ముఖ్యంగా మనల్ని ఆకర్షించేది డిజైన్. అద్భుతమైన శిల్పాలు మండపాలు, ప్రాకారాలు ప్రతిదీ చాలా రమ్యంగా, ఆసక్తికరంగా..

సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా బాలయ్య ఇల్లు!

సినీ ఇండస్ట్రీలో ఎవరేం చేసినా విచిత్రమే. వారికి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా ప్రజలకు ఆసక్తికరంగా ఉంటుంది.

కన్నులపండువగా స్టార్‌ మా సండే

ఆదివారం రోజూ కన్నా కాస్త ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌ కావాలనిపిస్తుంది. ఎందుకంటే - రోజూ కంటే ఇంట్లో గడిపే సమయం ఎక్కువ ఉంటుంది

'రాబర్ట్‌' ప్రీ రిలీజ్‌ వేడుక

ఛాలెంజింగ్ స్టార్ ద‌ర్శ‌న్ క‌థానాయ‌కుడిగా ఉమాప‌తి ఫిలింస్ బ్యాన‌ర్‌పై త‌రుణ్ కిషోర్ సుధీర్ ద‌ర్శ‌క‌త్వంలో

యాదాద్రి ఆలయ ప్రత్యేకతలేంటంటే..: ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి

యాదాద్రి పైన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, స్మారక టవర్లు (గోపురాలు), ఊపిరి తీసుకునే శిల్పాలు, మండపాలు, ప్రాకారాలు, స్తంభాల వరకూ ప్రతిదీ అద్భుతమే.