ఆ లిస్ట్‌లో ఉపేంద్ర మాధ‌వ్ చేరుతాడా?

  • IndiaGlitz, [Thursday,March 22 2018]

కొత్త ద‌ర్శ‌కుల‌ను ప్రోత్స‌హించ‌డం.. వాళ్ళ‌తో సినిమాలు చేసి, విజ‌యాల‌ను అందుకోవ‌డం క‌ళ్యాణ్‌రామ్‌కు కొత్తేంకాదు. అయితే క‌ళ్యాణ్ రామ్‌తో తొలి చిత్రం చేసి విజ‌యం అందుకున్న ద‌ర్శ‌కులు మాత్రం అగ్ర ద‌ర్శ‌కులుగా మారిన వైనం ఉంది.

క‌ళ్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన‌ అత‌నొక్క‌డే (2005)సినిమాతో సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమై.. తొలి విజ‌యాన్ని అందుకున్నారు. క‌ట్ చేస్తే.. టాలీవుడ్‌లో సురేంద‌ర్ రెడ్డి ఇప్పుడు టాప్ డైరెక్ట‌ర్‌గా రాణిస్తున్నారు. అలాగే.. 2015లో క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన ప‌టాస్ ద్వారా అనిల్ రావిపూడి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై.. మంచి విజ‌యాన్ని అందుకున్నారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడున్న స‌క్సెస్‌ఫుల్ యువ ద‌ర్శ‌కుల‌లో ఒక‌రిగా అనిల్ రాణిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో.. క‌ళ్యాణ్‌రామ్ తాజా చిత్రం ఎం.ఎల్.ఎ.తో  ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఉపేంద్ర మాధ‌వ్ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌చార చిత్రాల‌తో, పాట‌ల‌తో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాలు తీసుకురావ‌డంలో ఉపేంద్ర స‌క్సెస్ అయ్యారు.

రేపు (శుక్ర‌వారం) ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. క‌ళ్యాణ్ రామ్ సినిమాల ద్వారా ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌య‌మై.. తొలి చిత్రంతోనే ఘ‌న‌విజ‌యం అందుకున్న సురేంద‌ర్ రెడ్డి, అనిల్ రావిపూడి లాగే ఉపేంద్ర మాధ‌వ్ కూడా సెంటిమెంట్‌ను రిపీట్ చేసి టాప్ డైరెక్ట‌ర్ అనిపించుకుంటారేమో చూడాలి.

More News

'ప్రశ్నిస్తా' సినిమా ప్రారంభం

జనం ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రముఖనిర్మాత సత్య రెడ్డి నిర్మిస్తున్న 'ప్రశ్నిస్తా' మూవీ కి తన కుమారుడైన మనీష్ బాబు ని హీరోగా పరిచయం

రెండోసారి కూడా అలాగే..

హైప‌ర్‌, ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ ఫ‌లితాల‌తో నిరాశ‌పడ్డ యువ క‌థానాయ‌కుడు రామ్‌.. త‌దుప‌రి చిత్రాల విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

చంద్ర‌బాబు చేతుల మీదుగా జొన్న‌విత్తుల ప‌ద్య వాద్య క‌చేరి విడుద‌ల‌

తెలుగు పదాలకు పద్యాలకు వన్నె తెచ్చిన కవులు మన చరిత్రలో చాలా మందే వున్నారు.

45 దియోట‌ర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకున్న'ఛ‌లో'

నాగ‌సౌర్య హీరోగా, ర‌ష్మిక హీరోయిన్‌గా వెంకి కుడుముల ని ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం చేస్తూ ఐరా క్రియేషన్స్ బ్యానర్లో శంకర్ ప్రసాద్ స‌మ‌ర్ప‌ణ‌లో, ఉష నిర్మాతగా  నిర్మించిన చిత్రం ఛ‌లో..

అందరూ ఇది మన కథ అనుకోని చూడాల్సిన సినిమా 'నీది నాది ఒకే కథ' - ప్రీరిలీజ్ ఈవెంట్ లో యువకథానాయలు

శ్రీ విష్ణు హీరో గా నటించిన 'నీది నాది ఒకే కథ' చిత్రం మార్చ్ 23 న విడుదల కానుంది. టీజర్ మరియు పాటలకు అద్భుత స్పందన వస్తున్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు స్టూడెంట్ గా కనిపించనున్నారు.