మాస్క్‌లు తయారీ కోసం ఉపాసన వీడియో చూడండి!

  • IndiaGlitz, [Friday,March 06 2020]

కరోనా వైరస్ లేదా కోవిడ్-19 పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది.. చైనాలోని వూహాన్‌లో వచ్చిన ఈ వైరస్ ఖండాలను దాటేసి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. తెలంగాణలో సైతం వచ్చేసింది. మరోవైపు ఢిల్లీలో కూడా ఈ వైరస్‌ ఒకరిద్దరికి సోకినట్లు వైద్యులు నిర్దారణకు వచ్చారు. ఇలాంటి వార్తలు విన్న జనాలు గజ గజ వణికిపోతున్నారు. ఇన్నాళ్లు ఈ వైరస్‌కు దూరంగా ఉన్న భారత్‌కు వచ్చేసింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకడం తెలంగాణలో తీవ్ర కలకలం రేపుతోంది.

మాస్క్‌ల కొరత!

ఈ క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. అయితే.. మాస్క్‌లు మాత్రం ఎక్కడా దొరకట్లేదు. ఒక వేళ దొరికినా రూపాయిల్లో ఉండే ధర వందలు, వేలకు పాకింది. దీంతో మాస్క్‌లు దొరక్క జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ సతీమణి ఉపాసన కొణిదెల స్పందించి ఓ ఉపాయం చెప్పారు. టిష్యూలతో మాస్క్‌లు చేయడం ఎలా..? అనేది ఓ వీడియో రూపంలో ఆమె చెప్పారు.

ఇలా తయారు చేస్కోండి!

మెడికల్ షాపుల్లో మాస్కులు అందుబాటులో ఉండడం లేదని తెలుస్తోందని.. అయితే టిష్యూతోనూ మాస్కులు తయారు చేసుకోవచ్చని వీడియోలో నిశితంగా ఆమె చూపించారు. ‘కరోనాపై భయం వీడి బాధ్యతతో వ్యవహరించాలి. అవసరం ఉంటేనే మాస్కు ధరించాలి. మీకు కరోనా ఉన్నట్టు అనుమానం వచ్చినప్పుడు.. ఇతరులకు కరోనా సోకినట్టు అనిపించినప్పుడు మాత్రమే మాస్కులు ధరించాలి. మాస్కును తొలగించిన తర్వాత దాన్ని విధిగా చెత్తబుట్టలోనే వేయాలి’ అని వీడియోలో ఉపాసన వివరించారు. కాగా.. కరోనా నేపథ్యంలో పలువురు నటీనటులు తమకు తోచిన సలహాలు, సూచనలు చేసిన సంగతి తెలిసిందే.

More News

‘నిశ్శ‌బ్దం’ ట్రైల‌ర్‌ విడుద‌ల

`అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు

'అర్జున' 13వ తేదీకి వాయిదా

డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన అర్జున చిత్రాన్ని ముందుగా ప్రకటించినట్లు ఈ నెల 6న కాకుండా 13న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి వెల్లడించారు.

షూటింగ్ లో గాయపడ్డ అఖిల్

అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’.

ప‌వ‌న్ 27 లేటెస్ట్ అప్‌డేట్‌

రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ ముందుకెళుతున్నారు.

సూప‌ర్‌స్టార్‌కి విల‌న్‌గా మారుతున్న టాలీవుడ్ హీరో

సూప‌ర్‌స్టార్ ర‌జినీ కాంత్ తాజా చిత్రం ‘అణ్ణాత్త‌’. డైరెక్ట‌ర్ శివ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్‌పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై సినిమా తెర‌కెక్కుతోంది.