NagarjunaSagar:సాగర్ వద్ద ఆగని ఉద్రిక్తత.. ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదు

  • IndiaGlitz, [Friday,December 01 2023]

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఉద్రికత్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. డ్యాం వద్ద ఇప్పటికే ఏపీ పోలీసులు భారీగా మోహరించగా.. తెలంగాణ పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. డ్యాంపై ఏర్పాటు చేసిన ముళ్లకంచెను తొలగించేందుకు తెలంగాణ పోలీసులు యత్నించగా ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే సాగర్ కుడి కాలువ ద్వారా ఏపీకి నీటి విడుదల కొనసాగుతోండగా.. అడ్డుకునేందుకు తెలంగాణ అధికారులు యత్నిస్తున్నారు. మరోవైపు కృష్ణా బోర్డు అధికారులు సాగర్‌ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

జల వివాదంపై కేంద్రం ఆరా..

ఇప్పటికే సుమారు 4వేల క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదల చేసుకుంది. ప్రస్తుతం సాగర్‌లో 522 అడుగుల నీటిమట్టం ఉండగా.. మరో 12 అడుగులకు చేరితే డెడ్‌ స్టోరేజీకి చేరే అవకాశముంది. ఇదిలా ఉంటే ఏపీ పోలీసులపై నల్గొండ జిల్లా విజయపురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా డ్యాంపైకి వచ్చి కుడి కాల్వకు నీటిని విడుదల చేశారంటూ, తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు, తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని పేర్కొన్నారు. దీంతో ఏ1గా పేర్కొంటూ ఏపీ పోలీసులు, అధికారులపై కేసు నమోదైంది. అటు ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులపై ఆరా తీస్తోంది.

అసలు వివాదం ఏంటి..?

రాష్ట్ర విభజన సమయంలోనే కృష్ణా, గోదావరి నదీ బోర్డులు ఏర్పాటయ్యాయి. ఆ సమయంలో శ్రీశైలం జలాశయాన్ని ఆంధ్రప్రదేశ్‌, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలనే నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయం సరిగ్గా అమలు కాలేదు. శ్రీశైలం జలాశయంలో ఎడమ విద్యుత్తు కేంద్రం, తదితరాలను తెలంగాణ నిర్వహించుకుంటోంది. అటువైపు ఏపీ అధికారులను రానివ్వడం లేదు. అదే సమయంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో 26 గేట్లకు 13 గేట్లు ఏపీ భూభాగంలో ఉంటాయి. అయినా కానీ కుడి కాలువ నుంచి నీటిని ఏపీకి తెలంగాణ అధికారులే విడుదల చేస్తున్నారు. అయితే గతంలో కృష్ణా బోర్డు ఆదేశించినా నీళ్లు విడుదల చేయలేదని ఏపీ అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే కొంతకాలంగా ఉమ్మడి జలాశయాలను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో ఏపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఏపీ పోలీసులు భారీగా అక్కడికి చేరుకుని తమ పరిధిలో ఉన్న 13 గేట్ల నుంచి కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు.

More News

America:అమెరికాలో నరరూప రాక్షసులుగా మారిన తెలుగు వ్యక్తులు

బంగారు భవిష్యత్ కోసం ఎంతో కష్టపడి అగ్రరాజ్యం అమెరికా వెళ్లారు. కానీ అక్కడికి వెళ్లాక వారి బుద్ధి మారింది.

7 kg Gold:బ్యాంకులో 7కిలోల బంగారం మాయం.. మహిళా ఉద్యోగిని సూసైడ్..

వివిధ అవసరాల కోసం బ్యాంకులో ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారం మాయమైంది. దీంతో కస్టమర్స్ తీవ్ర ఆందోళనకు దిగారు.

AP Holidays:ఏపీలో వచ్చే ఏడాది సెలవులు ఇవే..

వచ్చే ఏడాది సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Telangana Hung:తెలంగాణలో హంగ్ వస్తే పరిస్థితేంటి.. ఎవరు ఏ పార్టీతో కలుస్తారు..?

దాదాపు రెండు నెలలుగా జరిగిన తెలంగాణ ఎన్నికల ప్రక్రియ గురువారంతో ముగిసింది. అయితే ఈసారి రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి.

Bigg Boss Telugu 7 : పుంజుకున్న అమర్‌దీప్.. వెనుకబడ్డ అర్జున్, పోటీ నుంచి తప్పుకున్న యావర్ , ‘‘ లక్ ’’ లేదంటూ కంటతడి

బిగ్‌బాస్ 7 తెలుగు తుది అంకానికి చేరుకుంది. ప్రస్తుతం హౌస్‌లో కంటెస్టెంట్స్ అంతా ఫినాలే అస్త్ర కోసం పోటీ పడుతున్నారు.