ఉగాదిని టార్గెట్ చేసిన స్టార్ హీరోలు..

  • IndiaGlitz, [Monday,March 28 2016]

తెలుగు వారి కొత్త సంవ‌త్స‌రాది ఉగాది. ఈ ప‌ర్వ‌దినాన సాధార‌ణంగా కొత్త‌ప‌నులు ప్రారంభిస్తుంటారు. ఇక మ‌న సినిమా ఇండ‌స్ట్రీలో అయితే కొత్త సినిమాలు ప్రారంభించ‌డం...ఆడియో రిలీజ్ చేయ‌డం...సినిమా రిలీజ్ చేయ‌డం చేస్తుంటారు.ఈసారి కూడా స్టార్ హీరోలు ఉగాదిని టార్గెట్ చేస్తున్నారు. ఇంత‌కీ ఉగాది రోజున స్టార్ హీరోలు ఏం చేయ‌నున్నార‌నుకుంటున్నారా..? ముందుగా చెప్పుకోవ‌ల‌సింది సీనియ‌ర్ హీరో న‌ంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ గురించి. ఆయ‌న త‌న వందో చిత్రం గురించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు బాల‌య్య‌. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి క‌థాంశంతో వందో సినిమా చేయ‌నున్నారు. ఈ చిత్రానికి యోధుడు అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఈ భారీ క్రేజీ మూవీని డైరెక్ట‌ర్ క్రిష్ నిర్మిస్తుండ‌డం విశేషం. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియ‌చేసేందుకు మంచిరోజు ఉగాది రోజు అని బాల‌య్య ఫిక్స్ అయ్యారు. అందుచేత త‌న వందో సినిమాని ఉగాది రోజు ప్ర‌క‌టించ‌నున్నారు.

బాల‌య్య త‌ర్వాత‌ ఉగాదిని టార్గెట్ చేసిన మ‌రో హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. యువ ద‌ర్శ‌కుడు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించిన స‌ర్ధార్ ఆడియోకు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఏప్రిల్ 2న సెన్సార్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకోనుంద‌ని స‌మాచారం. తెలుగుతో పాటు హిందీలో కూడా స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ రిలీజ్ అవుతుంది. ఈ సెన్సేష‌న‌ల్ మూవీని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉగాదిరోజున ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ర్వాత ఉగాదిని టార్గెట్ చేసిన మ‌రో హీరో సూప‌ర్ స్టార్ మ‌హేష్. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు న‌టిస్తున్న చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. నూతన సంవ‌త్స‌ర కానుక‌గా టీజ‌ర్ రిలీజ్ చేసిన బ్ర‌హ్మోత్స‌వం టీమ్ ఈసారి తెలుగు వారి కొత్త సంవ‌త్స‌రాది ఉగాది రోజున కూడా కొత్త టీజ‌ర్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేసారు. మిక్కీ మే జేయ‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మే నెల‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. సో...ఈ ఉగాది రోజున బాల‌య్య - ప‌వ‌న్ క‌ళ్యాణ్ - మ‌హేష్ ఫ్యాన్స్ కి పండ‌గే పండ‌గ‌.

More News

జాతీయ అవార్డ్ కోసం కంచె తో పోటీపడిన తెలుగు చిత్రాలివే

వరుణ్ తేజ్-ప్రగ్యాజైస్వాల్ జంటగా క్రిష్ తెరకెక్కించిన చిత్రం కంచె.

ఏప్రిల్ 1న 'అప్పుడలా ఇప్పుడిలా' విడుదల

సూర్యతేజ,హర్షికి పూనాచా హీరో హీరోయిన్లుగా జంపా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘అప్పుడలా ఇప్పుడిలా’.

చిరు - ప‌వ‌న్ ఫ్యాన్స్ గొడ‌వ ఒక‌రు మృతి..

మెగాస్టార్ చిరంజీవి - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న‌ద‌మ్ములిద్ద‌రూ..స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియో వేడుక‌లో క‌ల‌వ‌డంతో ఫ్యాన్స్ పండ‌గే చేసుకున్నారు.

క్రిష్ కంచె కి జాతీయ అవార్డ్ - ఆనందంలో వ‌రుణ్ తేజ్..

గ‌మ్యం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై...తొలి చిత్రంతోనే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అభిరుచిగ‌ల ద‌ర్శ‌కుడు క్రిష్. గ‌మ్యం ఆత‌ర్వాత‌ వేదం, కృష్ణ‌మ్ వందేజ‌గ‌ద్గురుమ్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన క్రిష్ తాజా చిత్రం కంచె.

63వ జాతీయ అవార్డు వివ‌రాలు..

ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌న సృష్టించిన తెలుగు సినిమా బాహుబలి. ప్ర‌భాస్, అనుష్క, త‌మ‌న్నా, రానా, ర‌మ్య‌కృష్ణ‌, స‌త్య‌రాజ్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి చిత్రం 600 కోట్లు వ‌సూలు చేసిన విష‌యం తెలిసిందే.