ప‌వ‌న్ చిత్రంలో ఉద‌య‌భాను?

  • IndiaGlitz, [Friday,September 29 2017]

జ‌ల్సా, అత్తారింటికి దారేది వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడో చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, అను ఇమ్మానియేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తుండ‌గా.. కుష్బూ, బొమ‌న్ ఇరాని కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కి ప‌రిచ‌యం కానున్నాడు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఓ ప్ర‌త్యేక గీతం ఉంద‌ని.. ఆ పాట‌లో ప్ర‌ముఖ యాంక‌ర్ ఉద‌య‌భాను త‌ళుక్కున మెరిసే అవ‌కాశ‌ముంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదివ‌ర‌కు త్రివిక్ర‌మ్ రూపొందించిన జులాయి చిత్రంలోనూ ఉద‌య‌భాను టైటిల్ సాంగ్‌లో తళుక్కున మెరిసారు. ఈ వార్త‌ల్లో ఎంత నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ఈ సినిమా విడుద‌ల కానుంది.

More News

మ‌నం డైరెక్ట‌ర్ తో నాని?

శ్రియ తొలి చిత్రం ఇష్టంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన విక్ర‌మ్ కె. కుమార్‌.. ఇష్క్‌, మ‌నం, 24 చిత్రాల‌తో తెలుగువారికి చేరువ‌య్యాడు. ప్ర‌స్తుతం అఖిల్‌తో హ‌లో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.

అడివి సాయికిరణ్, సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో శ్రీ చాముండీ చిత్ర సినిమాలు

'మిస్టర్‌ పెళ్లాం', 'శ్రీకారం' వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ చాముండీ చిత్ర చాలా విరామం తర్వాత మళ్లీ సినిమాలు నిర్మించనుంది. ఈ సంస్థ అధినేత గవర పార్థసారధి రెండు సినిమాలు నిర్మిస్తున్నారు.

ఆమెని కూడా మెచ్చుకున్న థ‌మ‌న్‌

యువ సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్‌.. ఇప్పుడు చేతి నిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. నాగార్జున న‌టించిన రాజుగారి గ‌ది2, హిందీ చిత్రం గోల్ మాల్ ఎగైన్‌, సాయిధ‌ర‌మ్ జ‌వాన్‌తో పాటు రేపు విడుద‌ల కానున్న శ‌ర్వానంద్ మ‌హానుభావుడు చిత్రాల‌కు థ‌మ‌న్‌నే సంగీత ద‌ర్శ‌కుడు.

ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ సినిమా అప్పుడేనా?

ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేసిన జైల‌వ‌కుశ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. టాక్ ఎలా ఉన్నా.. ఓపెనింగ్స్ బాగా వ‌చ్చాయి. మ‌రికొద్ది రోజుల్లో  సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అన్న‌ది స్ప‌ష్ట‌మౌతుంది.

'స్పైడర్‌' మొదటి రోజు కలెక్షన్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మించిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'స్పైడర్‌'. సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు 51 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది.