హీరో ఉద‌య్ కిర‌ణ్ అరెస్ట్..

  • IndiaGlitz, [Saturday,March 26 2016]

హీరో ఉద‌య్ కిర‌ణ్ అరెస్ట్ అన‌గానే ఉద‌య్ కిర‌ణ్ చ‌నిపోయాడు క‌దా...ఇదేదో త‌ప్పుగా రాసారు అనుకుంటే పొర‌పాటే. విష‌యం ఏమిటంటే..ఫేస్ బుక్ సినిమాలో న‌టించిన హీరో పేరు కూడా ఉద‌య్ కిర‌ణే. నిన్న రాత్రి జూబ్లీహిల్స్ లోని ఓ హోట‌ల్ లోప‌ల‌కి అనుమ‌తించ‌డం లేద‌ని ఉద‌య్ కిర‌ణ్ హోట‌ల్ సిబ్బందిని తిట్ట‌డంతోపాటు కొట్టాడ‌ట. అంతే కాదు హోట‌ల్ ఫ‌ర్నిచ‌ర్ ను కూడా ధ్వంసం చేసాడు.

అయితే ఈరోజు ఉద‌యం హోట‌ల్ యాజ‌మాన్యం ఉద‌య్ కిర‌ణ్ పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. రంగంలో దిగిన పోలీసులు ఉద‌య్ కిర‌ణ్ ను ప‌ట్టుకుని విచార‌ణ జ‌రుపుతున్నారు. సి.సి కెమెరాల్లో ఉద‌య్ కిర‌ణ్ వీరంగం అంతా క్లియ‌ర్ గా క‌నిపిస్తుంటే...ఉద‌య్ కిర‌ణ్ మాత్రం నేను అస‌లు రాత్రి హైద‌రాబాద్లో లేన‌ని..ముంబాయిలో ఉన్నాన‌ని, కావాలంటే నా కారులో ఫ్లైయిట్ టిక్కెట్ కూడా ఉంది చూసుకోండి అంటూ నోటికొచ్చిన‌ట్టు మాట్లాడుతున్నాడు. గ‌తంలో ఉద‌య్ కిర‌ణ్ పై డ్ర‌గ్స్ కేసు కూడా ఉంద‌ట‌. మ‌రి...సిసి కెమెరా విజువ‌ల్స్ చూపిస్తే ఏమంటాడో ఉద‌య్ కిర‌ణ్..?

More News

సరైనోడు ప్లానింగ్ ఏంటంటే..

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం సరైనోడు. సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర  కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సినిమాను ఏప్రిల్ 22న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

క‌మ్మ కులం గొప్పేమిట‌ని ప్ర‌శ్నిస్తున్న జ‌గ‌ప‌తి..

సింహ స్వ‌ప్నం సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై..ఎన్నోవిభిన్నపాత్ర‌లు పోషించి మెప్పించిన ఫ్యామిలీ చిత్రాల క‌థానాయ‌కుడు జ‌గ‌ప‌తి బాబు. క‌థానాయ‌కుడు నుంచి లెజెండ్ సినిమాతో ప్ర‌తినాయ‌కుడుగా మారి హీరోగానే కాకుండా విల‌న్ గా కూడా మెప్పించ‌గ‌ల‌న‌ని నిరూపించారు.

'జనతా గ్యారేజ్' ఎటువైపు..

ఎన్టీఆర్-కొరటాల శివ..టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టిస్తున్న క్రేజీ కాంబినేషన్ ఇది.'టెంపర్','నాన్నకు ప్రేమతో'చిత్రాలతో తన కెరీర్ లో కొత్త డైమన్షన్ తీసుకున్నాక ఎన్టీఆర్ చేస్తున్న సినిమా..

హేబాకో ర‌కం.. సోనారిక‌కో ర‌కం..

హ్యాట్రిక్ విజ‌యాల త‌రువాత రాజ్ త‌రుణ్ న‌టించిన 'సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు' బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. దాంతో త‌న త‌దుప‌రి చిత్రం 'ఈడో ర‌కం.. ఆడో ర‌కం'పై బోలెడు ఆశల‌ను పెట్టుకున్నాడు.

మా 'మీరా' చిత్రాన్ని ఆదిరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు : చిత్ర యూనిట్

ఆదిత్య,నికిత,ఇషికలు హీరో హీరోయిన్లుగా ఉనికొ సినీ స్వ్వాడ్ పతాకంపై సంతోష్ యూబులుస్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ గాజుల్లా కుమార్,గాజుల్లా రమేష్ లు నిర్మించిన చిత్రం 'మీరా'.