వారం గ్యాప్‌లో రెండు సోల్జ‌ర్ చిత్రాలు

  • IndiaGlitz, [Wednesday,April 25 2018]

దేశం కోసం ప్రాణత్యాగం చేయ‌డానికి కూడా వెనుకాడ‌ని ఆర్మీ ఆఫీస‌ర్ల క‌థ‌ల‌తో గ‌తంలో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. ఆద‌ర‌ణ పొందాయి. ఈ ఏడాదిలో కూడా అలాంటి సినిమాలు తెర‌పైకి రానున్నాయి. అయితే ఓ రెండు చిత్రాలు మాత్రం.. కేవ‌లం వారం గ్యాప్‌లో సంద‌డి చేయ‌నుండ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది. ఆ చిత్రాలే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, మెహ‌బూబా. యారోగెంట్ ఆర్మీ అధికారిగా అల్లు అర్జున్ న‌టించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ద్వారా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

మే 4న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. క‌ట్ చేస్తే.. స‌రిగ్గా వారం త‌రువాత అంటే మే 11న మెహ‌బూబా రానుంది. 1971 ఇండో-పాక్ వార్ నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమాలో సైనికుడిగా, ప్రేమికుడిగా రెండు పార్శ్యాలున్న పాత్ర‌లో యువ క‌థానాయ‌కుడు పూరీ ఆకాష్ న‌టించాడు. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ద్వారా నేహా శెట్టి క‌థానాయిక‌గా ప‌రిచ‌యం కానుంది. మ‌రి.. వారం రోజుల గ్యాప్‌లో వ‌స్తున్న ఈ సైనికుల్లో ఎవ‌రు ఆక‌ట్టుకుంటారో వేచి చూడాలి.

More News

ర‌వితేజ 'డిస్కోరాజా'

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం నేల టిక్కెట్టు సినిమాతో మే 24న ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. రామ్ తాళ్లూరి నిర్మాణంలో క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా చేస్తున్నాడు.

నాగ‌చైత‌న్య‌, స‌మంత‌..నో సీన్స్‌?

నాగ‌చైత‌న్య‌, స‌మంత.. ఆన్ ద‌ స్క్రీన్ మాత్ర‌మే కాదు.. ఆఫ్ ద‌ స్క్రీన్ కూడా మంచి జోడీ అనిపించుకున్నారు.

'లేడీ టైగర్' గా నయనతార

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించగా మలయాళంలో మంచి విజయం సాధించిన "ఎలెక్ట్ర"

'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ కి ముఖ్య అతిధిగా రామ్‌చ‌ర‌ణ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'.

రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్స్ బ్యాన‌ర్‌లోరూపొందుతోన్న చిత్రం 'ఈ మాయ పేరేమిటో'

ముప్పై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతో మంది స్టార్స్‌కు అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్.