కంగనా రనౌత్ సోదరికి షాకిచ్చిన ట్విట్టర్!

  • IndiaGlitz, [Thursday,April 16 2020]

అవును మీరు వింటున్నది నిజమే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్ ట్విట్టర్ అకౌంట్‌ను యాజమాన్యం నిలిపివేసింది. దీంతో సిస్టర్స్ ఇద్దరూ కంగుతిన్నారు. వాస్తవానికి అసభ్యంగా, ఏవి పడితే అవి రీట్వీట్స్ చేసేసినా.. ఒక్క ట్విట్టరే కాదు.. వాట్సాప్, ఫేస్‌బుక్ యాజమాన్యాలు సైతం ఇప్పుడు ఇదే పని చేస్తున్నాయ్. మరీ ముఖ్యంగా కరోనా నేపథ్యంలో మాత్రం సోషల్ మీడియాలో ఇష్టానుసారం ప్రవర్తిస్తే అటు పోలీసులు.. ఇటు సదరు యాజమాన్యాలు షాకిస్తున్నాయి.

అసలేం జరిగింది!?

అసలు విషయానికొస్తే.. యూపీలోని మొరాదాబాద్‌లో ఓ వ్యక్తి మరణించగా, వైద్యపరీక్షలు చేస్తే కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించేందుకు వైద్య సిబ్బంది, పోలీసులు రాగా స్థానికులు వారిపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనను ప్రస్తావిస్తూ రంగోలి ట్విట్టర్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందని సమాచారం. మరోవైపు.. రంగోలీ వ్యాఖ్యలపై బాలీవుడ్ ఫిలింమేకర్ రీమా కగ్టి తీవ్రంగా స్పందించి వెంటనే ఈమెపై చర్యలు తీసుకోవాలని సదరు ట్విట్టర్ యాజమాన్యానికి ట్యాగ్ చేయడంతో అసలు విషయం బయటపడింది. రంగోలి చేసిన ట్వీట్స్ నిబంధనలకు వ్యతిరేకమంటూ ట్విట్టర్ ఘాటుగా స్పందించి.. అకౌంట్‌ను నిలిపివేసింది.

చెల్లే కంగాను బలం..!

కాగా.. కంగనా రనౌత్ తరఫున అత్యంత బలంగా గళం వినిపిస్తూ ఉండేది రంగోలీ చందేల్. కంగానాను ఎవరైనా ఏమైనా విమర్శించి తెలిస్తే చాలు సోషల్ మీడియా వేదికగా దుమ్ముదులుపుతుంటుంది. ఇలా పలు సందర్భాల్లో అక్కకు సపోర్టుగా నిలిచేది. అలా సిస్టర్స్ ఇద్దరూ వివాదాస్పదంగా నిలిచేవారు. మరీ ముఖ్యంగా స్టార్‌ హీరోయిన్లు.. హీరోలు.. దర్శకులను సైతం.. అంతేకాదండోయ్ తెలుగు దర్శకులను కూడా టార్గెట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయ్. అలా అస్తమాను బాలీవుడ్‌లోనూ.. మీడియాలో.. సోషల్ మీడియాలో రంగోలి హాట్ టాపిక్ అయ్యేది.

More News

రామ్‌ చరణ్‌తో ఫన్నీగా మాట్లాడిన కేటీఆర్..!

అవునా ఇదేంటి.. ఈ ఇద్దరి మధ్య ఏం టాఫిక్ వచ్చిందబ్బా..? అని అనుకుంటున్నారా..? మీరు వింటున్నది నిజమే.. కానీ ఇక్కడ సినిమాలో హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాదండోయ్..

బోయ‌పాటి వెన‌క‌డుగు..!!

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106 చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. తొలి షెడ్యూల్ పూర్త‌యిన ఈ సినిమా

సూర్య కమిట్‌మెంటే వేర‌ప్పా!!

తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. అందుక‌నే ఆయ‌న సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుద‌ల‌వుతుంటాయి.

బ‌న్నీ త‌దుప‌రి సినిమా ఆ ద‌ర్శ‌కుడితోనేనా?

బ‌న్నీ త‌దుప‌రి సినిమాల‌ను భారీ ప్లాన్‌తోనే విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న పాన్ ఇండియా

ప‌వ‌న్‌తో ఇల్లీ బేబీ! ఓకే అయిన‌ట్లేనా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ టైటిల్ పాత్ర‌లో శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడిగా రూపొందుతోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. బోనీకపూర్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకాలపై