తిరుమల ఆలయ పెద్ద జీయ్యంగార్‌కు కరోనా.. కీలక నిర్ణయం దిశగా టీటీడీ!

  • IndiaGlitz, [Saturday,July 18 2020]

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ కరోనా విజృంభిస్తోంది. ఒక్క టీటీడీలోనే కరోనా కేసులు 150కి పైగా నమోదయ్యాయి. తాజాగా ఆలయ పెద్ద జీయ్యంగార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే 18మంది అర్చకులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో ఒకరికి సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ అర్చకుడిని మెరుగైన వైద్య చికిత్స కోసం అర్ధరాత్రి చెన్నై అపోలోకు తరలించారు. పెద్ద జీయంగార్‌ను కూడా చెన్నై అపోలోకి టీటీడీ అధికారులు తరలిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం టీటీడీలో మిగిలిన అర్చకులంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

మాకు బదిలీ సౌకర్యం కల్పించండి!

కరోనా వైరస్ టీటీడీలో విజృంభిస్తోందని.. తమలో చాలా మంది అర్చకులు కరోనా బారిన పడ్డారని ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు పేర్కొన్న విషయం తెలిసిందే. కరోనా గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వైరస్ ఎలా వ్యాపించిందో తెలియడం లేదని వారు వాపోయారు. అయితే భక్తుల వలన తమకు ఎలాంటి ఇబ్బందులూ లేవని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు ఇటీవల తెలిపారు. క్యూలైన్‌కు సమీపంలో అర్చకులెవరూ విధులు నిర్వహించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల అర్చక బృందమంతా వెళ్లి టీటీడీ చైర్మన్‌ను కలిసింది. తమ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బదిలీ సౌకర్యం కల్పించాలని కోరింది.

కీలక నిర్ణయం దిశగా టీటీడీ!

శ్రీవారి ఆలయంలో కరోనా విజృంభిస్తుండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. 1892లో రెండు రోజుల పాటు కేవలం భక్తులకు దర్శనాన్ని మాత్రమే కాదు... ఏకంగా ఆలయాన్ని కూడా మూసివేసినట్టు రికార్డుల్లో నమోదయ్యిందని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ ఓ సందర్భంటో వెల్లడించారు. దీనికి 128 ఏళ్ల తర్వాత కరోనా కారణంగా భక్తుల దర్శనాలను నిలిపివేయడం కరోనా కారణంగానే జరిగింది. కాగా.. టీటీడీ మరోసారి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అర్చకులతో పాటు టీటీడీ సిబ్బంది మొత్తం కరోనా బారిన పడుతుంటడం.. అదీ కూడా దర్శనాలు ప్రారంభమైన నాటి నుంచే జరుగుతుండటంతో మరోమారు దర్శనాలను నిలిపివేయాలని టీటీడీ భావిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి నేడో.. రేపో ప్రకటన వెలువడే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

More News

మ‌హేశ్ డబుల్ ధ‌మాకా?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ చిత్రం స‌ర్కారువారి పాట‌. ఈ ఏడాది సంక్రాంతికి స‌రిలేరు నీకెవ్వ‌రుతో మ‌హేశ్ సూప‌ర్‌హిట్ సాధించిన సంగ‌తి తెలిసిందే.

37 ఏళ్ల త‌ర్వాత ఆ బ్యాన‌ర్‌లో మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవితో సినిమా నిర్మించాల‌ని నిర్మాతలు భావిస్తుంటారు. ఆయ‌న చేసిన 150 చిత్రాల్లో చాలా మందినిర్మాత‌ల‌తో

సుశాంత్ ఆత్మతో మాట్లాడాడట.. వీడియో వైరల్

సుశాంత్ రాజ్‌పుత్ అకాల మరణం పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

గుడ్ న్యూస్ చెప్పిన భారత్ బయోటెక్..

భారత్ బయోటెక్ అభివ‌ృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ‘కోవాక్సిన్’ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధమైన విషయం తెలిసిందే.

అక్కడ థియేటర్స్‌కు పర్మిషన్ వచ్చేసింది.. మరిక్కడ?

కరోనా వైరస్ కారణంగా ఇప్పటికీ కూడా కష్టాల్లో ఉన్న పరిశ్రమ ఏదైనా ఉందంటే..