Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. రేపు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల, ఇలా బుక్ చేసుకోండి

  • IndiaGlitz, [Monday,January 09 2023]

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. రేపు ఆన్‌లైన్‌లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల కానున్నట్లు ప్రకటించింది. సోమవారం ఉదయం 10 గంటలకు జనవరి 12 నుంచి ఫిబ్రవరి 21 వ తేదీ వరకు చెందిన టికెట్లు విడుదల కానున్నాయి. రోజుకు 20 వేల చొప్పున టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. ఇక.. ఎల్లుండి వసతి గదుల కోటా విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. జనవరి 12 నుంచి ఫిబ్రవరి 28 వ తేదీ వరకు గదులను విడుదల చేయనుంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

భక్తులకు సంతృప్తికరంగా వైకుంఠ ఏకాదశి దర్శనం:

ఇదిలావుండగా.. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా జనవరి 2 నుంచి పదిరోజుల పాటు టీటీడీ టోకెన్లను జారీ చేసిన సంగతి తెలసిందే. జనవరి 2 నుంచి 11 వరకు టోకెన్లను విడుదల చేసింది. టోకెన్లు కలిగిన వారే దర్శనానికి రావాలని టీడీపీ ముందే చెప్పడంతో భక్తులకు సంతృప్తికరంగా దర్శనం జరుగుతోంది. అయితే జనవరి 12 నుంచి మిగిలిన రోజులకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను టీటీడీ పెండింగ్‌లో పెట్టింది.

కొత్త ఛైర్మన్‌ రేసులో భూమన కరుణాకర్ రెడ్డి:

అంతా బాగానే వుంది కానీ..తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్‌కు కాబోయే కొత్త ఛైర్మన్ ఎవరు అనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే వైసీపీ వర్గాలు చెబుతున్న దానిని బట్టి .. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ ఛైర్మన్‌గా నియమించాలని జగన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. భూమనకు గతంలో టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం వుంది. ఇదే సమయంలో పల్నాడు జిల్లా గురజాలకు చెందిన , బీసీ నేత జంగా కృష్ణమూర్తి పేరు కూడా టీటీడీ ఛైర్మన్ రేసులో వినిపించింది. యాదవ సామాజికవర్గానికి చెందిన ఈయన వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా వున్న కృష్ణమూర్తిని టీటీడీ ఛైర్మన్‌గా నియమించడం వల్ల తాము బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్న సంకేతాలను జగన్ పంపాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. మరి భూమన, జంగా లలో జగన్ ఎవరివైపు మొగ్గు చూపుతారో చూడాలి.

More News

ATM: స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేకెత్తిస్తున్న జీ5 'ఏటీఎం'

టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్, స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు ఓటీటీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు.

Pawan- CBN: చంద్రబాబుతో పవన్ భేటీ.. ఏపీ రాజకీయాల్లో కలకలం, పొత్తులపై ఇద్దరి స్పందనా ఇదే

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో

Bobby: చిరంజీవి గారు, రవితేజ గారితో కలసి సినిమా చేయడం నా అదృష్టం : దర్శకుడు బాబీ

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'వాల్తేరు వీరయ్య'

Veera Simha Reddy:'వీరసింహారెడ్డి' ఒక విస్ఫోటనం.. చరిత్రలో నిలిచిపోతుంది: బాలకృష్ణ

గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో

Rohit Shetty : షూటింగ్‌లో ప్రమాదం, బాలీవుడ్ డైరెక్టర్‌ రోహిత్ శెట్టికి గాయాలు.. హుటాహుటిన హాస్పిటల్ కి

బాలీవుడ్ దర్శక నిర్మాత రోహిత్ శెట్టి షూటింగ్‌లో గాయపడ్డారు. హైదరాబాద్ శివార్లలో జరుగుతున్న షూటింగ్‌లో ఆయన ప్రమాదానికి గురయ్యారు.