రాధేశ్యామ్‌ను వాడేసిన సజ్జనార్.. ప్రభాస్‌తో పూజ ఏం చెప్పిందంటే..?

  • IndiaGlitz, [Friday,March 11 2022]

తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్ తనదైన వ్యూహాలతో సంస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం, బస్ స్టేషన్‌‌లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం, పెళ్లికి ఆర్టీసీ బస్సులను వినియోగించుకున్న జంటలకు బహుమతులు అందించడం, మహిళలు, బాలికలకు ప్రత్యేక సేవలు వంటి వాటి ద్వారా ఆర్టీసీ బస్సులను ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనితో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా సజ్జనార్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే.. ఆ స్టార్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - పూజా హేగ్డే జంటగా నటించిన ‘‘రాధేశ్యామ్’’ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. దీంతో రాధేశ్యామ్ క్రేజ్‌ను వాడుకోవాలనుకున్నారు సజ్జనార్. దీనిలో భాగంగా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం సురక్షితం అని తెలియజెప్పేలా రాధేశ్యామ్ పోస్టర్‌తో ఉన్న మీమ్ ని సజ్జనార్ ట్వీట్ చేశారు.

ఇందులో ప్రభాస్- పూజా హెగ్డే ఆర్టీసీ గురించి మాట్లాడుకుంటున్నట్లు రూపొందించారు. చాలా రోజుల తర్వాత కలిశాం.. ఎటైనా టూర్ వెళదామా అని ప్రభాస్ అడగ్గా... వెళదాం కానీ ఆర్టీసీ బస్సులోనే వెళదాం.. అందులో అయితేనే ప్రయాణం సురక్షితం అంటూ పూజా హెగ్డే ప్రభాస్‌కి చెబుతుంది. ప్రస్తుతం ఈ మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు, నెటిజన్లు దీనిని విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఏదేమైనా వాడకమంటే సజ్జనార్‌దే.

More News

సీఎం కేసీఆర్‌కు అస్వస్థత.. యశోదా ఆసుపత్రికి తరలింపు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో శుక్రవారం వైద్య పరీక్షల కోసం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి యశోద ఆస్పత్రికి వెళ్లారు.

ప్రతి షోకి 100 టికెట్లు పంపండి.. థియేటర్‌ యాజమాన్యాలకు బెజవాడ మేయర్ లేఖ, వైరల్

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రభాస్ రాధేశ్యామ్‌కు ఏపీలో టికెట్ల ధరల పెంపు, అయినా మెలిక పెట్టిన జీవో..!!

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ - పూజా హేగ్డే జంటగా నటించిన ‘‘రాధేశ్యామ్’’

పంజాబ్ : పనిచేయని రియల్‌స్టార్ ప్రభావం.. ఓటమిపాలైన సోనూసూద్ సోదరి మాళవిక

పంజాబ్‌లో  సామాన్యుడి దెబ్బకు దిగ్గజ పార్టీలు విలవిలాడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ  ఘన విజయం సాధించింది.

కాంగ్రెస్‌‌కు ఘోర పరాభవం : పంజాబ్‌ మిస్... యూపీలో పనిచేయని ప్రియాంక మంత్రం

ఒకప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని ఏలిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ గడిచిన కొన్నేళ్లుగా తన ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోన్న సంగతి తెలిసిందే.