బ్రేక్ తీసుకున్న త్రిష‌

  • IndiaGlitz, [Monday,June 15 2020]

డ‌స్కీ బ్యూటీ త్రిష బ్రేక్ తీసుకోవాల‌నుకుంటుది. అస‌లు ఇంత‌కూ త్రిష ఎందుకు బ్రేక్ తీసుకోవాల‌ని అనుకుంటుంది? అనే విష‌యానికి వ‌స్తే.. సోషల్ మీడియా నుండి త్రిష గ్యాప్ తీసుకోవాల‌నుకుంది. ఈ విషయాన్నికూడా ఆమె సోష‌ల్ మీడియా ద్వారానే తెలియ‌జేసింది. ‘‘నా చుట్టూ జరుగుతున్న విషయాల గురించి నేను కొన్ని రోజుల పాటు తెలుసుకోవాలని అనుకోవడం లేదు. మైండ్‌కు ఇదొక డిజిట‌ల్ చికిత్స‌లాంటిది. ఇంట్లో అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండండి. ల‌వ్ యు గ‌య్స్.. మ‌ళ్లీ క‌లుద్దాం’’ అంటూ ట్విట్ట‌ర్ ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేశారు. ఇలా త్రిష బ్రేక్ ఎందుకు తీసుకోవాల‌నుకుంది? అనే విష‌యాన్ని మాత్రం చెప్ప‌లేదు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే త్రిష మూడు ప‌దులు దాటినా గ్లామ‌ర్ విష‌యంలో పోటీ ప‌డుతుంది. వ‌రుస అవ‌కాశాలను అందుకుంటుంది. లాక్‌డౌన్ స‌మ‌యంలో శింబుతో క‌లిసి గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో విన్నైతాండి వ‌రువాయ సినిమాకు సీక్వెల్‌గా ల‌ఘు చిత్రంలో న‌టించింది. అలాగే మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పొన్నియ‌న్ సెల్వ‌న్‌లోనూ న‌టిస్తుంది. మ‌రో ఐదు చిత్రాలు చేయాల్సి ఉంది. తెలుగులో చిరంజీవి ఆచార్య చిత్రంలో న‌టించాల్సి ఉన్న‌ది కానీ.. కొన్ని కార‌ణాల‌తో ఆమె ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నారు.

More News

అనుష్క ఎమోష‌న‌ల్ పోస్ట్‌

తెలుగులో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోన్న అనుష్క శెట్టి త‌న నిశ్శ‌బ్దం సినిమా విడుద‌ల కోసం వేచి చూస్తుంది.

పాటలే ముందు అంటోన్న ‘పుష్ప’

ఈ ఏదాది సంక్రాందిలో అల వైకుంఠపురములో చిత్రంతో భారీ హిట్ సాధించాడు.

‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ షాకిచ్చాడా?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’. దాదాపు 75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య‌

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈయ‌న వ‌య‌సు 34 ఏళ్లు.

10మిలియ‌న్స్ వ్యూస్ క్రాస్ చేసిన BB3 First Roar

సింహా', 'లెజెండ్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో