శ్రీవారిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి

  • IndiaGlitz, [Monday,November 06 2023]

పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. త్రిపుర గవర్నర్ నల్లా ఇంద్రసేనారెడ్డి దర్శించుకున్నారు. ఆదివారం తిరుపతికి వచ్చిన ఆయన నేరుగా తిరుమలకు వెళ్లి రాత్రి అక్కడే బస చేశారు. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్యం విరామ సమయంలో స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఇతర అధికారులు సాదర స్వాగతం తెలిపారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశ్వీరచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అర్చకులు అందజేశారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ చాలా కాలం తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడాదరు.

తిరుమల శ్రీవారిని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది. దర్శనం అనంతరం నారాయణస్వామి మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రాజకీయమంతా కుళ్లు, కుతంత్రాలు, అవినీతిమయమని ఆరోపించారు. సొంత మామను వెన్నుపోటు పొడిచిన దగ్గరి నుంచి నేటి వరకు ఆయన అనుసరిస్తున్న రాజకీయాలన్నీ అపవిత్రమన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మరోసారి జగనన్న ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.

ఇక శ్రీవారిని భారత బ్యాట్మెంటన్ క్రీడాకారుడు శ్రీకాంత్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే సినీనటుడు రాజేంద్రప్రసాద్ కూడా శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. దర్శనం అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేదపండితుల ఆశీర్వచనంతో పాటు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

More News

Jagananna Suraksha: అందరికీ రక్షణగా జగనన్న ఆరోగ్య సురక్ష

ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక నుంచి ఓ లెక్క.. అన్నట్లు సీఎం జగన్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రజలందరికీ వైద్య సేవలు అందించాలని

ఏపీలో విద్యా సంస్కరణలు భేష్.. నెదర్లాండ్స్ వేదికగా ప్రశంసలు..

ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం చేపడుతున్న విద్యా సంస్కరణలపై అంతర్జాతీయ వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Game Changer : రామ్ చరణ్ - శంకర్ ‘‘గేమ ఛేంజర్’’ సినిమా సాంగ్ లీక్ , ఇద్దరిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్

అప్పట్లో పైరసీ భూతం తెలుగు సినిమాను పట్టి పీడంచగా.. ఇప్పుడు లీకులు బెడద వెంటాడుతోంది.

AP GST:జీఎస్టీ వసూళ్లలో దుమ్మురేపిన ఏపీ.. సౌత్‌లోనే నంబర్ 1 స్టేట్‌గా రికార్డ్..

ఏపీలో జీఎస్టీ వసూళ్లు దుమ్మురేపాయి. రాష్ట్రంలో అభివృద్ధి ప్రగతి పథంలో దూసుకుపోతుంది అనడానికి జీఎస్టీ వసూళ్లే ప్రత్యక్ష ఉదహరణగా నిలుస్తున్నాయి.

Rashmika:రష్మిక మార్ఫింగ్‌ వీడియో వైరల్‌.. తీవ్రంగా స్పందించిన అమితాబ్ బచ్చన్..

'పుష్ప' సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక మందన్నా(Rashmika Mandanna)..  తాజాగా 'పుష్ప-2',