పవన్ అభిమానులకు ట్రీట్ ప‌క్కా!!

  • IndiaGlitz, [Monday,August 31 2020]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన‌రోజు సెప్టెంబ‌ర్ 2. ప‌వ‌న్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ఇప్ప‌టికే రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు. వ‌కీల్ సాబ్ సినిమాతో పాటు క్రిష్ సినిమాలోనూ ప‌వ‌న్ న‌టిస్తున్నారు. ఈ రెండు సినిమాల‌కు సంబంధించి ఏదైనా అనౌన్స్‌మెంట్ ఉంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. అయితే వీటితో పాటు బోనస్ ట్రీట్ కూడా ప‌క్కా అయ్యింది. మైత్రీమూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో హరీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభం కాబోయే సినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్ అన‌గానే మ‌న‌కు వెంట‌నే గుర్తుకొచ్చే సినిమా ‘గ‌బ్బ‌ర్ సింగ్‌’. ప‌దేళ్లు హిట్ లేకుండా ఉన్నా కూడా ప‌వ‌ర్‌స్టార్ రేంజ్‌ను బాక్సాఫీస్‌కు చాటి చెప్పిన చిత్ర‌మిది. ఇండ‌స్ట్రీ హిట్‌ను సాధించిన చిత్ర‌మిది. ఇప్పుడు ఇదే కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రానుండటం ప‌వ‌న్ అభిమానుల‌కు సంతోషాన్నిచ్చే విష‌య‌మే. ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ క‌థ‌ను కూడా రెడీ చేసుకున్నారు. ప‌వ‌న్ కోస‌మే వెయిట్ చేస్తున్నారీ డైరెక్ట‌ర్‌. ఈ చిత్రంలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా న‌టింప చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.

More News

‘వైల్డ్ డాగ్‌’ను షురూ చేసిన నాగార్జున‌

నాగార్జున లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్‌’ షూటింగ్ షురూ అయ్యింది. అహిషోర్ సాల్మోన్ దర్శకత్వంలో

‘వి’ అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది - ఇంద్ర‌గంటి

2004లో ద‌ర్శ‌కుడిగా ‘గ్ర‌హ‌ణం’ సినిమాతో కెరీర్‌ను ప్రారభించిన డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి.

1 మిలియన్ ప్లస్ వ్యూస్‌తో దూసుకుపోతోన్న ‘రెచ్చిపోదాం బ్రదర్’ లిరికల్ సాంగ్

ప్రచోదయ ఫిల్మ్స్ పతాకం‌పై కిరణ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రదారులుగా ఏ. కె. జంపన్న దర్శకత్వంలో..

ఈ సినిమా థియేటర్‌లో చూస్తే చాలా బాగుంటుందన్నారు: ‘వి’ డైరెక్టర్

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్‌, హ‌ర్షిత్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘వి’.

139మంది నాపై అఘాయిత్యానికి పాల్పడలేదు: షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన యువతి

తనపై 139 మంది అత్యాచారం జరిపారంటూ సంచలనం సృష్టించిన యువతి నేడు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది.