బూతులు తిట్టి, దాడి చేశారు.. వారిపై చర్యలు తీసుకోండి: పోలీసులకు రైటర్ చిన్ని కృష్ణ ఫిర్యాదు

  • IndiaGlitz, [Saturday,February 19 2022]

ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ పోలీసులను ఆశ్రయించడం టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. తనపై కొందరు దాడి చేశారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ శివార్లలోని శంకర్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తన స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఇప్పటికే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అంతేగాక తన భూమిని కబ్జా చేశారంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.

తనపై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నికృష్ణ పోలీసులను కోరారు. కరోనాతో ఇబ్బంది పడుతున్న తనపై దుండగులు దాడికి యత్నించారని, పరుష పదజాలంతో దూషించారని చిన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్ని కృష్ణ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా.. చిన్ని కృష్ణ స్టార్ రైటర్‌గా తెలుగు నాట ఫుల్ ఫేమస్. అగ్ర కథానాయకుల సినిమాల‌కు క‌థ‌లు అందించి ప్ర‌ముఖ ర‌చయిత‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అల్లు అర్జున్‌ ‘గంగోత్రి’, బాలకృష్ణ ‘న‌ర‌సింహ‌నాయుడు’, చిరంజీవి నటించిన ‘ఇంద్రా’ వంటి సినిమాలకు ఆయన కథలు అందించారు.

More News

నటి నివేతా పేతురాజ్‌ ఇంటి వద్దనే లేజర్‌ - స్కిన్సీ

ఇంటి వద్దనే లేజర్‌ హెయిర్‌ తగ్గింపు  కోసం స్కిన్సీ యొక్క  తాజా ప్రచారం ద్వారా పార్లర్‌కు వెళ్లే ప్రతి అమ్మాయి కష్టాలను వెల్లడిస్తున్న టాలీవుడ్‌ నటి నివేతా పేతురాజ్‌

భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్.. పవన్ కోసం చీఫ్ గెస్ట్‌గా కేటీఆర్

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన ‘‘భీమ్లా నాయక్’’ రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది.

"వర్జిన్ స్టోరి" యూత్ కు బాగా నచ్చుతోంది - నిర్మాత లగడపాటి శ్రీధర్

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా "వర్జిన్ స్టోరి".

కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్స్ అన్నారు.. కానీ : క్యాస్టింగ్ కౌచ్‌పై ఎస్తర్ వ్యాఖ్యలు

సినిమాల్లో అవకాశాల పేరిట యువతులను లోబరచుకునే ‘‘క్యాస్టింగ్ కౌచ్’’ మరోసారి  తెరపైకి వచ్చింది.

‘‘నా వయసు 36 .. 40 కాదు’’ ... కాస్త తెలుసుకుని వార్తలు రాయి : విలేకరికి అనసూయ వార్నింగ్

ముఖంపై చిరునవ్వుతో ఎప్పుడూ హుషారుగా కనిపించే స్టార్ యాంకర్, సినీ నటి అనసూయ భరద్వాజ్ ఫైర్ అయ్యారు. ఏకంగా మీడియాకు వార్నింగ్ ఇచ్చారు.