టాలీవుడ్‌లో మరో విషాదం.. గేయ రచయిత కందికొండ కన్నుమూత

  • IndiaGlitz, [Saturday,March 12 2022]

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గేయ రచయిత కందికొండ కన్నుమూశారు. ఆయన వయసు 49 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న కందికొండ శనివారం హైదరాబాద్ వెంగళరావు నగర్‌లో తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన మొక్కవోని ధైర్యంతో ఆ వ్యాధిని జయించినా, దాని ప్రభావం వెన్నెముకపై పడింది. దీంతో ఆరోగ్యం మరింత క్షీణించగా... ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, స్నేహితుల సహకారంతో ఇటీవల వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్నా కోలుకోలేకపోయారు.

ఇకపోతే.. ఆయన పూర్తి పేరు కందికొండ యాదగిరి. వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో కందికొండ జన్మించారు. ఉస్మానియాలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్ చదివారు. తెలుగు సాహిత్యం, రచనలపై ఆసక్తి కారణంగా సినీ రంగంవైపు అడుగులు చేశారు. ఇంటర్‌ చదువుతున్న సమయంలోనే సంగీత దర్శకుడు చక్రితో పరిచయడం ఏర్పడింది.

2001లో పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రంలో ‘మళ్లీకూయవే గువ్వ’ పాటతో ఆయన గేయ రచయితగా మారారు. ఆ రోజుల్లో ఆ పాట యువతను విశేషంగా అలరించింది. దీంతో వరుస అవకాశాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. అలా ‘ఇడియట్‌’లో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’, ‘సత్యం’లో ‘మధురమే మధురమే’, ‘ఐయామ్‌ ఇన్‌ లవ్‌’, ‘పోకిరి’లో ‘గల గల పారుతున్న గోదారిలా’ ‘జగడమే’, ‘లవ్‌లీ’లో ‘లవ్‌లీ లవ్‌లీ’ తదితర పాటలు రాశారు. చివరిగా 2018లో ‘నీది నాది ఒకే కథ’లో రెండు పాటలు రాశారు. ఈ విధంగా 20 ఏళ్ల సినీ ప్రస్థానంలో 1300లకు పైగా పాటలు రాసిన ఆయన మరణం తెలుగు సినీ సంగీత ప్రియులను విషాదంలోకి నెట్టింది.

More News

సమంతకు బౌన్సర్‌లా మారిన బాలీవుడ్ స్టార్ హీరో.. వీడియో వైరల్

సినీ తారలంటే జనాల్లో వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ హీరోయిన్లంటే యువత మరింత ఉత్సాహం చూపిస్తారు.

హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘‘చోర్ బజార్’’ చిత్రం నుంచి మెలోడీ గా సాగే 'జడ' లిరికల్ సాంగ్ విడుదల

ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు.

"డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో ఖిలాడి

"డిస్నీ ప్లస్ హాట్ స్టార్" ఆడియన్స్ కోసం ఫామిలీ ప్యాక్ లాంటి ఎంటర్ టైన్మెంట్ తో వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. దాని పేరు "ఖిలాడి". స్ట్రీమింగ్ మొదలైంది.

చిక్కుల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నిర్మాత బెల్లంకొండ సురేష్ ... చీటింగ్ కేసుపెట్టిన ఫైనాన్షియర్

టాలీవుడ్ యువ హీరో బెల్లం కొండ శ్రీనివాస్‌, ఆయ‌న తండ్రి ప్ర‌ముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌లు చిక్కుల్లో పడ్డారు. వీరిద్దరిపై హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఛీటింగ్ కేసు న‌మోదైంది.

ఆగస్టు 12న అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతోన్న 'ఏజెంట్' రిలీజ్

ప్రామిసింగ్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి ల హై బడ్జెట్ స్టైలిష్, యాక్షన్ థ్రిల్లర్ చిత్రం `ఏజెంట్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.