ఒకే చోట చేరిన టాలీవుడ్ ద‌ర్శ‌కులు...

  • IndiaGlitz, [Tuesday,June 05 2018]

పోటీ ప్ర‌పంచంలో ఒక‌రినొక‌రు చూసి ఈర్ష్య ప‌డుతుంటారు. ఓ స్టేజ్ వ‌చ్చిన త‌ర్వాత అస‌లు మాట్లాడుకోరని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ట్రెండ్ మారుతుంది. హీరోలు, ద‌ర్శ‌కులు సినిమాల‌కు సంబంధం లేకుండా స్నేహితుల్లా క‌ల‌సి మెలిసి తిరుగుతున్నారు.

వీలున్న‌ప్పుడల్లా పార్టీలు చేసుకుంటున్నారు. ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే.. మ‌హేశ్ 25వ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్న డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి త‌న మిత్రులైన ఇత‌ర ద‌ర్శ‌కుల‌కు ఘ‌నంగా పార్టీ ఇచ్చాడు.

ఈ పార్టీకి టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుల‌తో పాటు యువ ద‌ర్శ‌కులు కూడా విచ్చేశారు. వీరిలో ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, సుకుమార్‌, క్రిష్ జాగ‌ర్ల‌మూడి, కొర‌టాల శివ‌, హ‌రీశ్ శంక‌ర్‌, అనిల్ రావిపూడి, నాగ్ అశ్విన్‌, సందీప్ రెడ్డి వంగా త‌దిత‌రులు పాల్గొన్నారు.