close
Choose your channels

Dil Raju : టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్‌రాజు ఇంట్లో మరో విషాదం

Tuesday, October 10, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌రాజు ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి శ్యాంసుందర్ రెడ్డి వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్యాంసుందర్ రెడ్డి సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

శ్యాంసుందర్ రెడ్డి భార్య ప్రమీలమ్మ.. ఈ దంపతులకు ముగ్గురు సంతానం . వీరు దిల్‌రాజు (వెంకట రమణారెడ్డి) , విజయ్ సింహారెడ్డి , నరసింహారెడ్డి. ఈ కుటుంబానిది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా. చిన్నప్పటి నుంచి వెంకట రమణారెడ్డిని రాజు రాజు అని పిలుస్తూ వుండటంతో ఆయన పేరు రాజుగా మారింది. ఆ తర్వాత దిల్‌ సినిమా ఘన విజయం సాధించడంతో అప్పటి నుంచి దిల్‌రాజుగా మారింది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా తెలుగు సినిమాను శాసించగల అతికొద్ది మందిలో ఒకరిగా దిల్‌రాజు నిలిచారు.

దిల్‌రాజు తొలుత అనితను వివాహం చేసుకున్నారు. ఆమె 2017లో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆయన డిసెంబర్ 10, 2020న తేజస్విని అనే బంధువుల అమ్మాయితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు జన్మించాడు. అంతకుముందే దిల్‌రాజుకు అనిత ద్వారా హన్షిత జన్మించింది. ఈమెకు కూడా వివాహమైన సంగతి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.