టాలీవుడ్డే నెంబర్‌ వన్:  కంగనా

  • IndiaGlitz, [Saturday,September 19 2020]

బాలీవుడ్ క్వీన్‌, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోనిలిచే నటి ఎవరైనా ఉన్నారా? అంటే మనకు ఠక్కున గుర్తుకొచ్చే పేరు కంగనా రనౌత్‌. సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతితో మరింతగా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు బాలీవుడ్‌లో డ్రగ్స్‌ ఉన్నాయంటూ ఏకంగా మహారాష్ట్ర శివసేన ప్రభుత్వంతో పోరాటం చేస్తుంది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు కంగనా. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో అతిపెద్ద ఫిలింసిటీ కట్టాలనుకుంటున్నట్లు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించిన నేపథ్యంలో కంగనా చేసిన వ్యాఖ్యలు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారాయి.

మన దేశంలో అందరూ బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమనే పెద్ద పరిశ్రమగా అనుకుంటారు. కానీ అది తప్పు. ఇప్పుడు టాలీవుడ్‌ పరిశ్రమ అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో షూటింగ్‌లు జరుగుతున్నాయి. ఇప్పుడు నోయిడాలో ఫిలింసిటీ కట్టాలనుకుని ఆదిత్యనాథ్‌గారు తీసుకున్న నిర్ణయం బావుంది. మంచి నిర్ణయం. దీంతో పాటు సినీ పరిశ్రమలో చాలా మార్పులు తీసుకురావాలి. అన్నీ చిత్ర పరిశ్రమలు కలిసి భారతీయ చిత్రపరిశ్రమగా ఏర్పడితే మంచిది. మనం విడిపోవడం వల్ల హాలీవుడ్ లాభపడుతోంది అని కంగనా రనౌత్‌ స్పందించారు.

More News

నెక్ట్స్‌పై నితిన్‌ క్లారిటీ.. టబు స్థానంలో!

'రంగ్‌ దే' సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న హీరో నితిన్‌ నెక్ట్స్‌ మూవీని స్టార్ట్‌ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

అనాథ శరణాలయం నిర్మాణాన్ని పూర్తి చేసిన సాయి తేజ్..

మెగా హీరోల్లో సాయి తేజ్ వేరుగా ఉంటాడు. ఆయన ఆలోచనా విధానం సామాన్యుడికి చాలా దగ్గరగా ఉంటాయి.

సెప్టెంబ‌ర్ 21న 'చావుక‌బురుచ‌ల్ల‌గా' మూవీ నుంచి స్పెష‌ల్ వీడియో విడుద‌ల‌

మెగా ప్రొడ్యూస‌ర్ శ్రీ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ స్టార్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా, హ్యాపెనింగ్ యంగ్ హీరో కార్తీకేయ‌,

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..

బిగ్‌బాస్ సీజన్ 4 ఈ వారం ఆసక్తికరంగానే నడిచింది. వైల్డ్ కార్డ్ ద్వారా ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు.

విశాఖలో టీడీపీకి షాక్.. పార్టీని వీడనున్న మరో ఎమ్మెల్యే..

ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. మరో ఎమ్మెల్యే టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.