జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ: బెజవాడ చేరుకున్న చిరంజీవి, మహేశ్, ప్రభాస్.. నాగ్, ఎన్టీఆర్ మిస్

సినీ పరిశ్రమ సమస్యలపై సీఎం జగన్‌తో చర్చించేందుకు గాను టాలీవుడ్ ప్రముఖుల బృందం విజయవాడ చేరుకుంది. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ , పోసాని కృష్ణ మురళి, ఆర్ నారాయణ మూర్తి వంటి సినీ ప్రముఖులు జగన్‌తో భేటీ కానున్నారు. అయితే ఈ భేటీకి నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ దూరంగా వుంటున్నట్లుగా సమాచారం.

అంతకుముందు  సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు రమ్మని ఏపీ సీఎంఓ నుంచి తనకి ఆహ్వానం అందిందని అగ్రకథానాయకుడు చిరంజీవి అన్నారు. గురువారం ఉదయం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యేందుకు ప్రత్యేక విమానంలో ఆయన అమరావతికి పయనమయ్యారు. ఈ నేపథ్యంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సీఎంఓ నుంచి నాకు మాత్రమే ఆహ్వానం అందిందని నాకు తెలిసింది. నాతోపాటు ఎవరు వస్తున్నారో నాకు తెలీదు. మీడియాలో వస్తోన్న కథనాలు చూసిన తర్వాతనే మిగతా విషయాలు తెలిశాయి. సీఎంను కలిసిన తర్వాత మాట్లాడతా. ఈ రోజు సమస్యలకు శుభం కార్డు పడుతుందని ఆశిస్తున్నా’’ అని చిరు వ్యాఖ్యానించారు.  

అంతకుముందు విజయవాడ వెళుతూ... బేగంపేట ఎయిర్‌పోర్టులో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు రమ్మని ఏపీ సీఎంఓ నుంచి తనకి మాత్రమే ఆహ్వానం అందిందని మెగాస్టార్ అన్నారు. తనతోపాటు ఎవరు వస్తున్నారో తెలియదని... మీడియాలో వస్తోన్న కథనాలు చూసిన తర్వాతనే మిగతా విషయాలు తెలిశాయని చిరంజీవి పేర్కొన్నారు. సీఎంను కలిసిన తర్వాత మిగిలిన విషయాలు వెల్లడిస్తానని చిరు చెప్పారు. ఈ రోజు సమస్యలకు శుభం కార్డు పడుతుందని ఆయన ఆకాంక్షించారు. అలాగే అల్లు అరవింద్ మాట్లాడుతూ... సినీ పరిశ్రమకు సంబంధించి అన్ని సమస్యలకు నేటితో ఎండ్ కార్డ్ పడుతుందని అన్నారు. టాలీవుడ్‌కి మేలు జరిగేలా ప్రకటన వస్తుందని భావిస్తున్నానని.. తమ కుటుంబం నుంచి చిరు వెళ్లారని, అందువల్ల తాను వెళ్లాల్సిన అవసరం లేదని అల్లు అరవింద్ చెప్పారు.

More News

పవన్ సంచలన నిర్ణయం.. త్వరలో రెండు రాష్ట్రాల్లో నారసింహ యాత్ర

రాజకీయంగా యాక్టీవ్ అవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో యాత్ర చేయాలని ఆయన ఫిక్స్ అయ్యారు.

'జీ 5' ఓటీటీలో ఫిబ్రవరి 18న సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'బంగార్రాజు' విడుదల

'జీ 5' ఓటీటీ లక్ష్యం ఒక్కటే... వీక్షకులకు వినోదం అందించడమే. కామెడీ కావచ్చు, డ్రామా కావచ్చు, యాక్షన్ కావచ్చు. జానర్ ఏదైనా...

రేపు జగన్‌ను కలవనున్న చిరంజీవి..  మెగాస్టార్ వెంట ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్..?

సినీ పరిశ్రమ సమస్యలు, టికెట్‌ రేట్ల వివాదానికి ఏదో ఒక పరిష్కారం చూపాలని అటు టాలీవుడ్ పెద్దలు..

మేడారం జాతరలో కీలక ఘట్టం.. నేడు మండమెలిగె పండుగ

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం ‘‘సమ్మక్క- సారలమ్మ’’ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.

మరోసారి మానవత్వం చాటుకున్న సోనూసూద్.. యువకుడిని తన చేతులతో మోసుకుని ఆసుపత్రికి

సోనూసూద్... వెండితెరకు విలన్‌గానే తెలిసిన ఈ వ్యక్తి, అతని వ్యక్తిత్వం కోవిడ్ కష్టకాలంలో లోకానికి తెలిసింది.