మాదకద్రవ్యాల కేసులో టాలీవుడ్ నటి అరెస్ట్..

  • IndiaGlitz, [Sunday,January 03 2021]

మాదక ద్రవ్యాల కేసు.. టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపేసి.. తరువాత బాలీవుడ్‌లోనూ ప్రకంపనలు సృష్టించి చివరకు తిరిగి టాలీవుడ్‌ మెడకూ చుట్టుకుని ఇటీవలి కాలంలో సైలెంట్ అయిపోయింది. తిరిగి తాజాగా మరోసారి టాలీవుడ్‌లో కలకలం రేపింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐ అధికారులు విచారణ నిర్వహిస్తుండగా.. డ్రగ్స్ కోణం వెలుగు చూసింది. దీంతో కేసును ఎన్సీబీకి అప్పగించారు. అప్పట్లో ఎన్సీబీ విచారణలో ఇద్దరు, ముగ్గురు టాలీవుడ్ ప్రముఖ నటుల పేర్లు సైతం వినిపించాయి.

ఈ మధ్య కొంత కాలంగా డ్రగ్స్‌కు సంబంధించిన అప్‌డేట్స్ అయితే ఏమీ లేవు. దీంతో మాదక ద్రవ్యాల సరఫరా పూర్తిగా ఆగిపోయిందని బాలీవుడ్, టాలీవుడ్ ఊపిరి తీసుకుంటున్న తరుణంలో సడెన్‌గా మరోమారు టాలీవుడ్ నటి డ్రగ్స్‌తో ముంబై మీరా రోడ్డులోని ప్రముఖ హోటల్‌లో డ్రగ్స్‌తో పట్టుబడటం సంచలనంగా మారింది. ఆదివారం ఎన్సీబీ అధికారులు సదరు హోటల్‌పై దాడి చేశారు. ఈ దాడిలో టాలీవుడ్ నటితో పాటు డ్రగ్ పెడ్లర్ చాంద్ మహ్మద్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్సీబీ దాడిలో నాలుగు వందల గ్రాముల డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

More News

'చెక్' ఫస్ట్  గ్లింప్స్ రిలీజ్!!

నితిన్ - చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో భవ్య క్రియేషన్స్ పతాకం పై  వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం "చెక్".

జనవరిలో సందడే సందడి.. 5 సినిమాల రిలీజ్ డేట్ అనౌన్స్..

లాక్‌డౌన్ కారణంగా మూత పడిన థియేటర్లన్నీ దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి.

బెల్లంకొండ‌కు ఆమె ఓకే చెబుతుందా..?

టాలీవుడ్ యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. తెలుగులో స్టార్ హీరో ప్ర‌భాస్‌ను మాస్ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర చేసిన మూవీ ‘ఛ‌త్ర‌ప‌తి’ని

మెగాస్టార్ రెడీ.. ‘లూసిఫ‌ర్‌’కు డేట్ ఖ‌రారు..!

మోహ‌న్‌లాల్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘లూసిఫ‌ర్‌’ను చిరంజీవి రీమేక్ చేయాల‌ని అనుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

డేట్ ఫిక్స్ చేసుకున్న ‘పుష్ప’‌.. 

ఈ ఏడాది 'అల వైకుంఠపురములో' సినిమాతో నాన్‌ 'బాహుబలి' రికార్డులు క్రియేట్‌ చేసిన బన్నీ.. సుకుమార్ దర్శకత్వంలో