ఓం నమో వెంకటేశాయ షూటింగ్ ప్రారంభించేది ఆరోజే..

  • IndiaGlitz, [Wednesday,June 22 2016]

కింగ్ నాగార్జున - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు - స్వ‌ర‌వాణి కీర‌వాణి ఈ ముగ్గురు కాంబినేష‌న్ లో రూపొందుతున్న తాజా చిత్రం ఓం న‌మో వెంక‌టేశాయ. ఈ చిత్రాన్ని శిరిడి సాయి చిత్ర నిర్మాత మ‌హేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. వెంక‌టేశ్వ‌ర స్వామి భ‌క్తుడు హ‌థీరామ్ బాబా జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ చిత్రాన్నిరూపొందిస్తున్నారు.
ఈ చిత్రంలో అనుష్క‌, విమ‌లారామ‌న్, ప్ర‌గ్యా జైస్వాల్ న‌టిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు పాట‌ల రికార్డింగ్ పూర్తి చేసారు. ఈ భ‌క్తిర‌స చిత్రాన్ని జులై 2 నుంచి హైద‌రాబాద్ లో ప్రారంభించ‌నున్న‌ట్టు స‌మాచారం. అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు చిత్రాల‌కు క‌థ అందించిన జె.కె.భార‌వి ఈ చిత్రానికి క‌థ అందించారు. నాగార్జున‌, రాఘ‌వేంద్ర‌రావు క‌ల‌యిక‌లో రానున్న ఈ నాలుగ‌వ భ‌క్తిర‌స చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

బ్రిటిష్ ఆత్మ‌కు - సౌతిండియ‌న్ ఆత్మ‌కు మ‌ధ్య ఫైటే ఈ దొర : స‌త్యరాజ్

స‌త్యరాజ్, శిబి స‌త్యరాజ్, బిందు మాధ‌వి ప్రధాన పాత్ర‌లో రూపొందిన త‌మిళ చిత్రం జాక్స‌న్  దొరై. ఈ చిత్రాన్ని ధ‌ర‌ణి ధ‌ర‌న్ తెర‌కెక్కించారు. త‌మిళ్ లో రూపొందిన ఈ హ‌ర్ర‌ర్ చిత్రాన్ని దొర టైటిల్ తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. జులై 1న దొర చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

మురుగుదాస్ మూవీలో న్యూలుక్ తో మ‌హేష్‌..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా మురుగుదాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. దాదాపు 100 కోట్ల భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్ర‌సాద్, ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

చిరు సినిమాకు రచయితలెక్కువయ్యారా..?

దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత సినీ రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

'జనతాగ్యారేజ్' ఆడియో హైదరాబాద్ లో కాదా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కొరటాల శివదర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం జనతాగ్యారేజ్.

చిరు మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి రంగం సిద్దమైంది.