Prajapalana:ప్రజాపాలన కార్యక్రమానికి నేడే చివరి తేదీ.. దరఖాస్తు చేసుకున్నారా..?

  • IndiaGlitz, [Saturday,January 06 2024]

తెలంగాణలో ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో పాటు ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగియనుంది. ఈ పథకాలకు అర్హులు గుర్తించేందుకు డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలి రోజు నుంచే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. డిసెంబర్‌ 31న ఆదివారం, నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న మాత్రం దరఖాస్తులు స్వీకరించలేదు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కోటి 8 లక్షల 94వేల 115 ప్రజాపాలన దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. ఇందులో ఆరు గ్యారంటీల కోసం 93లక్షల 38వేల111 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 15,55, 704 దరఖాస్తులు ఇతర అంశాలపై వచ్చినట్లు పేర్కొన్నారు. ఇవాళ చివరి రోజు కావడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 12వేలకుపైగా గ్రామ పంచాయితీల్లో 3వేలకుపైగా మన్సిపాలిటీ వార్డుల్లో ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించారు.

ఇక గ్రేటర్ హైదరాబాద్‌ పరిదిలో 500పైగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు 21లక్షల 52వేల 178 అప్లికేషన్‌లు వచ్చాయి. ఇందులో 4లక్షల దరఖాస్తులు కొత్త రేషన్‌ కార్డు కోసమే వచ్చాయి. ఇందులోనూ పాతబస్తీ నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.

మరోవైపు ఇప్పటివరకు అందుకున్న దరఖాస్తులను స్క్రూట్నీ చేసే ప్రక్రియను అధికారులు చేపట్టారు. వీటిని ఆన్‌లైన్ చేసే ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించనున్నారు. జనవరి 17నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ ప్రక్రియ చేసేందుకు భారీగా డీటీపీ ఆపరేటర్లను నియమించారు. అయితే ప్రజల నుంచి భారీగా దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం వారి అర్హతలను ఎలా నిర్ణయిస్తుందనే విషయంపై మాత్రం వివరాలు వెల్లడించలేదు.

వచ్చే నెల నుంచి మహిళలకు రూ.2,500 ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఇందుకు ఎలాంటి అర్హతలు నిర్ణయిస్తారనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. ఇదిలా ఉంటే ప్రజాపాలనకు ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో ప్రతి నాలుగు నెలలకు ఓసారి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

More News

Ambati Rayudu:బిగ్ బ్రేకింగ్: వైసీపీకి ఊహించని షాక్.. అంబటి రాయుడు రాజీనామా..

వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల పార్టీలో చేరిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆ పార్టీని వీడుతున్నట్లు  ప్రకటించారు.

Pawan:పట్టా పుస్తకాల్లో జగన్ ఫొటో ఎందుకు.. దోచుకునేందుకే కొత్త చట్టం: పవన్

సీఎం జగన్ దోచుకున్న ఆస్తులను చట్టబద్ధం చేసుకునేందుకే భూహక్కుల చట్టం తీసుకొచ్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఆరోపించారు.

Keshineni Nani:టీడీపీకి రాజీనామా చేస్తా.. మరో బాంబ్ పేల్చిన కేశినేని నాని..

విజయవాడం ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) మరో బాంబ్ పేల్చారు. త్వరలోనే తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించి సంచలనం రేపారు.

Kapu Ramachandra Reddy: జగన్‌ను నమ్మి సర్వనాశనం అయ్యా.. వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా..

ఇంఛార్జ్‌ల మార్పు అధికార వైసీపీలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్తున్నారు.

BRS Party: బీఆర్ఎస్ పార్టీకి 'డూ ఆర్ డై'.. తెలంగాణ నినాదం ఫలిస్తుందా..?

తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు చావోరేవో కానున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను బలంగా ఎదుర్కోవాలంటే చెప్పుకోదగ్గ స్థాయిలో ఎంపీ సీట్లు గెలవాలని