ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తీరథ్ సింగ్ రావత్

  • IndiaGlitz, [Wednesday,March 10 2021]

ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తీరథ్ సింగ్ రావత్ నియమితులయ్యారు. ఉత్తరాఖండ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. కాగా.. సొంత పార్టీ నేతల అసమ్మతి కారణంగా సీఎంగా త్రివేంద్ర సింగ్ రావత్ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో బీజేపీ ఎంపీ తీరథ్ సింగ్ రావత్ సీఎం పగ్గాలు చేపట్టనున్నారు. ఆయన్ను సీఎంగా ఎన్నుకుంటూ పార్టీ వర్గాలు బుధవారం నిర్ణయం తీసుకున్నాయి. అంతకు ముందు సీఎం రేసులో ఎమ్మెల్యే ధన్ సింగ్ రావత్‌తో పాటు కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియల్ పేర్లు వినిపించాయి. కానీ పార్టీ మాత్రం తీరథ్ వైపే మొగ్గు చూపింది.

ఉత్తరాఖండ్ తొమ్మిదవ ముఖ్యమంత్రిగా తీరథ్ సింగ్ రావత్ బాధ్యతలు చేపట్టనున్నారు. 56 ఏళ్ల తీరథ్ సింగ్ రావత్.. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2013-15 మధ్య ఉత్తరాఖండ్‌లో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. గతంలో రాష్ట్ర ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. మంగళవారం డెహ్రాడూన్‌లో పార్టీ లెజిస్లేచర్ మీటింగ్‌లో పాల్గొన్న బీజేపీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. పనితీరు సరిగా లేని కారణంగా రాష్ట్రంలో నాయకత్వాన్ని మార్చాలనే డిమాండ్లు రావడంతో మాజీ సీఎం త్రివేండ్ర సింగ్ రావత్ తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

More News

న్యూలుక్‌తో అభిమానులను మెస్మరైజ్ చేస్తున్న పవన్

దాదాపు మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. అటు రాజకీయాలను.. ఇటు సినిమా షూటింగ్‌లనూ

శశికళ అందుకే వెనక్కితగ్గారా? తమిళనాట రసవత్తరంగా రాజకీయం

ఇటీవల కాలంలో తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆది నుంచి సీఎం అభ్యర్థిగా ఉండాలని భావించిన శశికళ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

‘కేజీఎఫ్’ హీరో యశ్ తల్లిపై గొడవకు దిగిన గ్రామస్తులు

‘కేజీఎఫ్’ హీరో.. కన్నడ స్టార్ యశ్ తల్లిపై ఆమె సొంత గ్రామస్తులంతా గొడవకు దిగారు. యశ్ తల్లి తమ పొలం నుంచి ఉన్న దారిని మూసివేయడంతో ఆ గ్రామానికి చెందిన రైతులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు

చిరుకి డీహైడ్రేషన్.. అర్థాంతరంగా నిలిచిపోయిన షూటింగ్

మెగాస్టార్ చిరంజీవి అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ‘ఆచార్య’ షూటింగ్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్‌లో భాగంగా ప్రస్తుతం చిరు ఖమ్మంలో ఉన్నారు.

నాకు సిగ్గేసింది నీ మెచ్యూరిటీ చేసి: అల్లు అర్జున్

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా వరస విజయాలతో సక్సెస్ ఫుల్ నిర్మాతగా దూసుకుపోతున్న బన్నీ వాసు నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా చావు కబురు చల్లగా. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఈ సినిమా వస్తుంది.