మ‌ల్టీస్టార‌ర్ కోసం మూడు నిర్మాణ సంస్థ‌లు...

  • IndiaGlitz, [Friday,March 30 2018]

తెలుగులో మ‌ల్టీస్టార‌ర్ సంస్కృతి ఎక్కువ అవుతుంది. అందులో భాగంగా విక్ట‌రీ వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో ఓ మ‌ల్టీస్టార‌ర్ రూపొంద‌నుంది. గ‌త ఏడాది 'జై ల‌వకుశ‌'తో స‌క్సెస్ అందుకున్న ద‌ర్శ‌కుడు కె.రవీంద్ర (బాబి) ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన చ‌ర్చ‌లు, ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వివ‌రాల ప్ర‌కారం ఈ సినిమాను మూడు నిర్మాణ‌ సంస్థ‌లు నిర్మించ‌నున్నాయి.

అందులో ఒక‌టి వెంక‌టేశ్‌కు చెందిన నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌.. కాగా మ‌రో సంస్థ కోన ఫిలింస్ .. మూడో సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ. జూన్‌లో సినిమా ప్రారంభ‌మ‌వుతుందని టాక్‌. ఇందులో వెంక‌టేశ్ స‌ర‌స‌న న‌య‌న‌తార‌, నాగ‌చైత‌న్య స‌ర‌స‌న స‌మంత హీరోయిన్స్‌గా న‌టిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.