ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో మ‌రో ముగ్గురు హీరోలు?

  • IndiaGlitz, [Tuesday,April 10 2018]

మహానటుడు ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా 'యన్.టి.ఆర్' తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ బ‌యోపిక్‌ను నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. సంచలన దర్శకుడు తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియ‌న్స్‌ను రంగంలోకి దింపారు.

ఇక నటీనటుల విషయానికొస్తే.. ప్రధాన పాత్రను బాలకృష్ణ పోషిస్తుండగా.. చంద్రబాబు నాయుడు పాత్రలో రానా కనిపించనున్నట్టు సమాచారం.  ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో హీరో కూడా వచ్చి చేరారు. ఆ హీరో మ‌రెవ‌రో కాదు.. క‌ళ్యాణ్ రామ్‌.  ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన తొలినాళ్ళలో చైతన్య రథం ఎక్కి ఎన్నికల ప్రచారం సాగించగా.. ఆ రథానికి ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ సారథిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ సినిమాలో హరికృష్ణ పాత్ర కోసం కళ్యాణ్ రామ్‌ను సంప్రదించినట్టు సమాచారం. అయితే.. ఈ విషయమై కళ్యాణ్ రామ్ నుండి ఎటువంటి ధృవీకరణ రాలేదు. ఇదిలా ఉంటే.. నారా రోహిత్, తారకరత్న కూడా ముఖ్య పాత్రలు పోషించనున్నట్టు సమాచారం. దాదాపుగా నందమూరి హీరోలందరూ నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు మాత్రం ఇప్పటివరకు ప్రస్తావనకు రాలేదు.

ఈ సినిమాలో నటించమని తనని ఎవరూ సంప్రదించలేదని.. ఒకవేళ సంప్రదిస్తే తప్పకుండా తన అంగీకారం చెబుతానని ఇటీవల తారక్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా.. మే నుంచి చిత్రీకరణను ప్రారంభించి ఈ ఏడాది దసరాకి చిత్రాన్ని వ&#

More News

నితిన్‌కు మూడోసారి వ‌ర్క‌వుట్ కాలేదు?

యువ క‌థానాయ‌కుడు నితిన్‌కు క‌లిసొచ్చిన నెలల్లో ఏప్రిల్ నెల‌కు ప్ర‌త్యేక స్థాన‌ముంది. ఎందుకంటే.. గ‌తంలో ఇదే నెల‌లో నితిన్ హీరోగా న‌టించిన రెండు చిత్రాలు విడుద‌లై మంచి విజ‌యం సాధించాయి.

గోపీచంద్‌కు ఆ తేది మ‌రోసారి క‌లిసొస్తుందా?

యాక్షన్ చిత్రాల క‌థానాయ‌కుడు గోపీచంద్ న‌టిస్తున్న 25వ చిత్రం 'పంతం'. మెహరీన్ నాయిక‌. ఈ చిత్రంతో కె.చక్రవర్తి (చక్రి) దర్శకుడిగా పరిచయం కానున్నారు.

న‌రేష్ సినిమాలో పూర్ణ.. అయితే..?

సీమ ట‌పాకాయ్ అనే సినిమాలో అల్ల‌రి న‌రేశ్‌, పూర్ణ జ‌త‌గా న‌టించారు. ఇప్పుడు మ‌రోసారి అల్ల‌రి న‌రేశ్ సినిమాలో పూర్ణ న‌టించ‌నుంది.

నాగ‌శౌర్య చిత్రానికి ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌

'ఛలో' విజ‌యం యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్యలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. త‌న కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా త‌రువాత త‌దుప‌రి ప్రాజెక్టుల

'కాలా' గురించి 'నా బంగారు తల్లి' ఏమందంటే..

'నా బంగారు తల్లి' సినిమాకుగాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్న‌ నటి అంజలి పాటిల్. ఆ తర్వాత పలు  హిందీ సినిమాలతో పాటు మరాఠి, ఆంగ్ల చిత్రాల్లోనూ నటిస్తూ వచ్చారు అంజ‌లి.