Nobel Prizes:భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వరంచిన నోబెల్ బహుమతులు

  • IndiaGlitz, [Tuesday,October 03 2023]

2023 సంవత్సరానికి గాను భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి అవార్డును రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. ముగ్గురిని ఈ నోబెల్ బహుమతి వరించింది. అమెరికా శాస్త్రవేత్త పెర్రీ అగోస్తిని, జర్మనీ శాస్త్రేవేత్త ఫెరెన్స్ క్రౌజ్, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్ హ్యులియర్‌కు నోబెల్ అవార్డు దక్కింది. అణువుల్లో ఎలక్ట్రాన్ డైనమిక్స్‌ను అధ్యయనం చేయడం, కాంతి తరంగాల ఆటోసెకెండ్‌ పల్స్‌ను ఉత్పత్తి చేసే పరిశోధనలకు గాను వీరిని నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రటరీ జనరల్ హన్స్ ఎలెగ్రెన్ తెలిపారు.

డిసెంబర్ 10న అవార్డులు ప్రదానం.. 11 మిలియన్ల స్వీడిష్ క్రౌన్స్ నగదు..

సోమవారం వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి ప్రకటించగా ఇవాళ(మంగళవారం)భౌతిక శాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రంలో, గురువారం సాహిత్య విభాగంలో, శుక్రవారం శాంతి పురస్కారం విజేతలను ప్రకటిస్తారు. ఈ ఏడాది డిసెంబర్ 10న అవార్డులు ప్రదానం చేస్తారు. అదే రోజు వారికి నగదును కూడా అందజేస్తారు. ఈ ఏడాది నోబెల్ బహుమతి గెలుచుకున్న వారికి 11 మిలియన్ల స్వీడిష్ క్రౌన్స్(9,86,000 డాలర్లు) ప్రైజ్ మనీ అందించనున్నారు.

స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరుతో 1901లో నోబెల్ ఫౌండేషన్ ఏర్పాటు..

2012లో 10 మిలియన్ క్రౌన్స్ నుంచి 8 మిలియన్ క్రౌన్స్‌కు ప్రైజ్ మనీని తగ్గించారు. అయితే 2017లో 9 మిలియన్ క్రౌన్స్ చేయగా.. 2020లో 10 మిలియన్ క్రౌన్స్‌కు పెంచారు. ఇప్పుడు దానిని 11 మిలియన్ క్రౌన్స్‌కు పెంచారు. 1896లో కన్నుమూసిన ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరుతో 1901లో నోబెల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పురస్కారాలను ఇవ్వడం మొదలు పెట్టారు. ప్రపంచంలోనే అత్యుత్తమ అవార్డుగా దీనిని పరిగణిస్తారు.

More News

Narendra Modi:కేసీఆర్‌ నన్ను కలిశారు.. నా కళ్లలోకి చూసే ధైర్యం లేదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల వేళ తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మోదీ..

Chandra Babu:సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ 9వ తేదికి వాయిదా

స్కిల్ డెవలెప్మెంట్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 9కి వాయిదా వేసింది.

తెలంగాణకు వచ్చిన కేంద్ర ఎన్నికల బృందం.. ఈనెల 6 తర్వాత షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్!

తెలంగాణలో ఎన్నికలకు వేళాయైంది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.

పెడన వారాహి సభలో రాళ్ల దాడికి ప్రభుత్వం కుట్ర చేస్తోంది: పవన్ కల్యాణ్‌

వారాహి యాత్రలో భాగంగా బుధవారం పెడనలో జరగబోయే సభలో అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bigg Boss 7 Telugu : శివాజీ నస, బోర్ కొట్టించిన కంటెస్టెంట్స్ .. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే..?

బిగ్‌బాస్ 7 తెలుగు విజయవంతంగా 5వ వారంలోకి అడుగుపెట్టింది. గత వారం రతికా రోజ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.