మూడు కోట్ల సెట్...

  • IndiaGlitz, [Saturday,December 31 2016]

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేష‌న్‌లోద్వార‌క క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. స‌రైనోడు వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌ర్వాత డైరెక్ట‌ర్ బోయపాటిశ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది.

ఈ చిత్రంలో త‌మిళ స్టార్ శ‌ర‌త్‌కుమార్‌తో పాటు జ‌గ‌ప‌తి బాబు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. . ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్ర‌గ్యా జైశ్వాల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా పాట చిత్రీక‌ర‌ణ‌కు సిద్ధ‌మవుతుంది. ఈ పాట కోసం ఓ భారీ సెట్ వేయ‌బోతున్నార‌ట‌. ఈ సెట్ విలువ దాదాపు మూడు కోట్ల రూపాయ‌లుంటుంద‌ని స‌మాచారం. అన్న‌పూర్ణ స్టూడియోలో ఈ సెట్‌ను వేస్తున్నార‌ట‌. ఓ యంగ్ హీరో సెట్ కోసం ఇంత భారీ రేంజ్ లో ఖ‌ర్చు పెడుతుండ‌ట‌మంటే చిన్న విష‌యం కాదు.