ఈసారి పుష్పక విమానం ఎక్కబోతున్నాడు.

  • IndiaGlitz, [Friday,July 22 2016]

'అల్లుడు శీను'తో మంచి విజయాన్నే దక్కించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యింది. త్వరలోనే సెట్స్ లోకి వెళ్లనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించనుందని అందుకు ఆమెకు భారీ మొత్తాన్నే రెమ్యున‌రేష‌న్‌గా ముట్ట‌చెప్పార‌ని వార్త‌లు విన‌ప‌డుతు్నాయి. అయితే సరైనోడు తర్వాత బోయపాటి చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ ఈ చిత్రాన్ని నిర్మించున్నారు. ఈ చిత్రానికి 'పుష్ప‌క‌విమానం' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని టాక్‌.