జ‌న‌తా గ్యారేజ్ స్టోరీ ఇదే..!

  • IndiaGlitz, [Saturday,August 13 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్ లో రూపొందుతున్న భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన జ‌న‌త గ్యారేజ్ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. జ‌న‌తా గ్యారేజ్ మూవీ ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అస‌లు...జ‌న‌తా గ్యారేజ్ స్టోరీ ఏమిటి అనే ఇంట్ర‌స్ట్ అంద‌రిలో ఏర్ప‌డింది. ఇంత‌కీ జ‌న‌తా గ్యారేజ్ స్టోరీ ఏమిటంటే....ఈ చిత్రంలో ఎన్టీఆర్ పేరు ఆనంద్. అత‌నికి ఈ భూమి అన్నా...ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా చాలా ఇష్టం..! చెట్లు, మొక్క‌లు, గాలి, నీరు వాటిని కాపాడుకోవ‌డ‌మే అత‌ని ప‌ని..! ఇక ఆనంద్ కి చెట్లు అంటే ఎంత ప్రాణ‌మో బుజ్జి అంటే కూడా అంతే ప్రాణం. అయితే...బుజ్జి స‌మంతా..? నిత్యామీన‌నా అనేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్..!

ఇక మోహ‌న్ లాల్ క్యారెక్ట‌ర్ గురించి చెప్పాలంటే....ఆయ‌న‌కి ఎదుటోడి కష్టం విని, కళ్లలో నీళ్లు తిరిగి గొంతులో ముద్ద దిగదు. ఇది మోహ‌న్ లాల్ క్యారెక్ట‌ర్. ఈ సృష్టికి ఇద్దరినీ కలిపితే బావుంటుంద‌నిపించి క‌లిపేసింది. మోహ‌న్ లాల్ ఎన్టీఆర్ కి ఓ మాట చెబుతాడు...మొక్క‌ల‌తో పాటు మ‌నుషుల‌ను కూడా ప్రేమించు ఈ భూమి ఇంకా అందంగా ఉంటుంద‌ని. ఇక అప్ప‌టి నుంచి వీరిద్ద‌రూ క‌లిసి బ‌ల‌హీనుల‌కు అండ‌గా ఉండి బ‌ల‌వంతులం అనే అహంకారంతో అన్యాయాలు, అక్ర‌మాలు చేసే వాళ్ల‌ను ఎలా ఎదుర్కొన్నారు వారికి ఎలా బుద్ధి చెప్పారు అనేదే క్లుప్తంగా జ‌న‌తా గ్యారేజ్ స్టోరీ..!