Pawan Kalyan:అకీరాకు నేను ఇచ్చిన ఆస్తి ఇదే.. ఇక వాడి ఇష్టం: పవన్ కల్యాణ్‌

  • IndiaGlitz, [Thursday,May 16 2024]

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. గత కొన్ని నెలలుగా ఏపీ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అధికార వైసీపీ ఓటమే లక్ష్యంగా టీడీపీ-బీజేపీతో పొత్తు పెట్టుకుని అలుపెరుగని పోరాటం చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దగ్గరి నుంచి సీట్ల సర్దుబాటుతో పాటు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. కూటమి అభ్యర్థుల తరపున సుడిగాలి పర్యటనలు చేశారు. మధ్యలో కొన్నిసార్లు అనారోగ్యానికి కూడా గురయ్యారు. అయినా కానీ గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించారు. మరోవైపు పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దిగారు.

దీంతో ఆయన గెలుపుకోసం మెగా హీరోలతో పాటు ఇతర సినీ నటులు క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. ఇటు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవడంతో పాటు ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే పోలింగ్ అనంతరం ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలు, సినిమాలు, కుటుంబ విషయాలను కూడా పవన్ వెల్లడించారు. అందులో పిల్లల పెంపకం, వారి చదువు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“అర్బన్ ప్రాంతంలో ఉండే సగటు ఉద్యోగి పిల్లలు ఎలా పెరుగుతారో మా పిల్లలను కూడా అలాగే పెంచాం. వాళ్లకు నేను ఏం చెప్పానంటే.. మీకు చదువు చెప్పించగలను. కుదిరితే సినిమాలు చేసి ప్రాపర్టీ ఇస్తానన్నాను. వాస్తవానికి మా మధ్య ఆస్తుల గురించి టాపిక్ రాదు. నాకు ఓ ఇల్లు ఉండేది. దాన్ని అకీరా, ఆధ్య కోసం నా మాజీ భార్యకు రాసి ఇచ్చాను. పిల్లలకు మనం ఎంత ఆస్తి ఇచ్చాం అని కాదు. ఎంత నిలబెట్టుకుంటారు? అనేదే ముఖ్యం. మా నాన్న నాకు ఏం ఇవ్వలేదు. మా అన్నయ్య నాకు స్కిల్స్ నేర్పించారు. ధైర్యం ఇచ్చారు. దాన్ని ఆసరాగా చేసుకుని ఇండస్ట్రీలో కొనసాగాను. మంచి పురోగతి సాధించాను. నేను కూడా నా పిల్లలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు ఎడ్యుకేషన్ అందించాను” అని వివరించారు. కాగా పవన్, మాజీ భార్య రేణు దేశాయ్‌కు అకీరా, ఆధ్య అనే పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక మరో భార్య అన్నా లెజీనోవాకు ఓ అబ్బాయి, అమ్మాయి కూడా ఉన్నారు.

ఇదిలా ఉంటే కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావడంతో సినిమాలపై ఫోకస్ పెట్టనున్నారు. ముందుగా కొద్ది రోజుల పాటు ఆయన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చే సమయానికి తిరిగి రానున్నట్లు సమాచారం. ఫలితాలు వెల్లడైన వెంటనే ఆగిపోయిన సినిమా షూటింగ్స్ మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం సుజీత్‌తో కలిసి ‘ఓజీ‘, హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్‘, క్రిష్-జ్యోతికృష్ణ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు‘ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూడు సినిమాలకు సంబంధించిన టీజర్లు, పోస్టర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

‘ఓజీ‘ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘హరిహర వీరమల్లు‘ కూడా ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్నిటికంటే ముందుగా ‘ఓజీ’ షూటింగ్ లో పాల్గొననున్నారట. ఇప్పటికే చాలా వరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగా, వీలైనంత త్వరగా మిగతా షూటింగ్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. ‘ఓజీ‘ తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్‘, ‘హరి హర వీరమల్లు‘ సినిమాలకు డేట్స్ ఇవ్వనున్నారు. ఈ సినిమాలతో పాటు సురేందర్ రెడ్డి, సముద్రఖని దర్శకత్వంలోనూ పవన్ సినిమాలు చేయనున్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. మొత్తానికి ఇన్నాళ్లు రాజకీయాల్లో బిజీగా చూసిన తమ హీరోను.. త్వరలోనే వెండితెర మీద చూసేందుకు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

More News

CM Jagan:మళ్లీ వైసీపీదే అధికారం..ఈసారి భారీ మెజార్టీతో గెలవబోతున్నాం: సీఎం జగన్

ఏపీలో పోలింగ్ ముగిసి మూడు రోజులు అవుతుంది. దీంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

AP:ఏపీలో పథకాల లబ్ధిదారులకు శుభవార్త.. డీబీటీ నిధులు జమ ప్రారంభం..

ఏపీ ఎన్నికల వేళ చర్చనీయాంశమైన సంక్షేమ పథకాల నిధుల విడుదల ప్రారంభమైంది. పోలింగ్ పూర్తి కావడంతో

YCP MLC:షాకింగ్ న్యూస్.. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీపై అనర్హత వేటు

ఏపీలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. పోలింగ్‌కు ముందు చాలా మంది వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేసి టీడీపీ,

Vettaiyan:'వేట్టయాన్' షూటింగ్ పూర్తి చేసిన తలైవా రజినీకాంత్

సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో 'జై భీమ్' ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ అనే చిత్రం రూపొందుతోంది.

CM Revanth Reddy:జూన్ 2 తర్వాత ఏపీకి కేటాయించిన ఆస్తులు మనవే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..

తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎవరికి వారే తమదే ధీమా అని వ్యక్తం చేస్తున్నారు.