close
Choose your channels

ఆ ద‌ర్శ‌కుడితో మూడోసారి

Friday, July 8, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గోపీచంద్ హీరోగా మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ను `బెంగాల్ టైగ‌ర్` తర్వాత సంప‌త్ నంది ద‌ర్శ‌త్వంలో శంఖం, రెబల్ వంటి యాక్ష‌న్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు నిర్మాత‌లుగా ఓ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో గోపీచంద్ స‌ర‌స‌న ముగ్గురు హీరోయిన్స్ న‌టిస్తున్నారు.

ప్ర‌స్తుతం గోపీచంద్ చేస్తున్న ఆక్సిజ‌న్ పూర్తి కావ‌చ్చింది. ఈ సినిమాను త్వ‌ర‌లోనే సెట్స్‌లోకి తీసుకెళ్ళ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈచిత్రంలో మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఓ హీరోయిన్‌గా నటించ‌నుంద‌ని స‌మాచారం. మ‌రో హీరోయిన్‌గా రాశిఖ‌న్నాను సంప్ర‌దిస్తున్నారు. మ‌రి మూడో హీరోయిన్ ఎవ‌రో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. కాగా సంప‌త్‌నంది ద‌ర్శ‌క‌త్వంలో ర‌చ్చ, బెంగాల్‌టైగ‌ర్ చిత్రాలు త‌ర్వాత త‌మ‌న్నా చేయ‌బోతున్న మూడో చిత్ర‌మిది కావ‌డం విశేషం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.