ముచ్చటగా మూడోసారి నానితో..

  • IndiaGlitz, [Saturday,February 17 2018]

టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు నిర్మాత దిల్ రాజు. ఈయన సంస్థ‌లో ఓ సినిమా చేసి, త‌మ‌ ప‌నితీరుతో మెప్పిస్తే... దర్శకుడికైనా, నటుడికైనా, నటికైనా మరో సినిమాకి అవకాశం ఇచ్చేస్తూ ఉంటారు రాజు. కుదిరితే ఆరంభంలోనే వీరితో ఒప్పందం కుదుర్చుకుంటారు ఆయ‌న‌. ఇప్పటికే ఈయన సంస్థ‌లో యువ కథానాయకుడు నాని నేను లోకల్', ఎం.సి.ఎ' సినిమాలతో విజయాలను అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు నానితో మరో సినిమా చేయడానికి దిల్ రాజు సిద్ధపడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ హ్యాట్రిక్ ప్రాజెక్టు చేయబోతున్నట్టు నాని కూడా ఇప్ప‌టికే ప్రకటించేశారు. అయితే ఇంకా దర్శకుడు గురించి వివరాలు తెలియరాలేదు.

ప్రస్తుతం నాని కృష్ణార్జునయుద్ధం' పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత మార్చి నెల నుంచి శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్‌లో నాగ్‌తో ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అలాగే హను రాఘవపూడి, విక్రమ్ కుమార్ లతో కూడా సినిమాలు చేయబోతున్నారు. హను రాఘవపూడి సినిమాకి నిర్మాత సిద్ధంగా ఉన్నారు. బహుశా విక్రమ్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కబోయే సినిమాని దిల్ రాజు నిర్మించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

More News

'ఐతే 2.ఓ' మోషన్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

ఇంద్రనీల్‌ సేన్‌గుప్తా, జారా షా, అభిషేక్‌, కర్తవ్య శర్మ, నీరజ్‌, మృణాల్‌, మృదాంజలి కీలక పాత్రధారులుగా రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఐతే 2.ఓ'. ఫర్మ్‌ 9 పతాకంపై కె.విజయరామారాజు, హేమంత్‌ వల్లపురెడ్డి నిర్మిస్తున్నారు. శనివారం ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌, టీజర్‌ను నిర్మాత రాజ్‌ కందుకూరి, దర్శకురా

మలయాళ బ్లాక్ బస్టర్ 'ఆనందం' .. ఇప్పుడు తెలుగులో!

కాలేజీ నేపథ్యంలో కథలు అల్లుకుని యువత మనసులకు హత్తుకునేటట్టు తెరకెక్కించిన ప్రతిసారీ విజయం తథ్యం.

ఆశాభోస్లేకి య‌శ్ చోప్రా జాతీయ అవార్డు ప్ర‌దానం..!

లెజండ‌రి సింగ‌ర్ ఆశాభోస్లేకి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన య‌శ్ చోప్రా మెమురియ‌ల్ జాతీయ అవార్డు 2018ని టి.సుబ్బిరామిరెడ్డి ఫౌండేష‌న్  ఫిబ్ర‌వ‌రి 16న ముంబాయిలోని ఓ ప్ర‌ముఖ హోట‌ల్ లో ప్ర‌దానం చేసారు.

'మా' నాట‌కోత్స‌వాలు 'గుర్తు తెలియ‌ని శవం' నాటిక ప్ర‌ద‌ర్శ‌న‌!

'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్) ర‌జ‌తోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా... కీ..శే..డా..డి.రామానాయుడు 3 వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా 'మా' ఆధ్వ‌ర్యంలో మూడు రోజుల పాటు ( 16,17,18 తేదీల్లో) భాగంగా త‌ల‌పెట్టిన నాట‌కోత్స‌వాలు శుక్ర‌వారం సాయంత్రం హైద‌రాబాద్  ఫిల్మ్ న‌గర్ హౌసింగ్ సోసైటీ కాంప్లెక్స్ లో ప్రారంభ‌మ‌య్యాయి

ఫిబ్ర‌వ‌రి 25న 'దండుపాళ్యం -3' ప్రీ-రిలీజ్ ఈవెంట్

దండుపాళ్యం బ్యాచ్ అంటే సినిమా జనాల్లో క్రేజ్ వుంది.  దండుపాళ్యం 1, దండుపాళ్యం 2 భారీ ఓపెనింగ్స్ తో సూపర్ సక్సెస్ సాధించాయి. ఇప్పుడు ఈ ఫ్రాంచయిస్ లో చివ‌రి పార్టు గా ధండుపాళ్యం-3 మార్చి 2న రానుంది.  విభిన్నమైన కథాంశంతో, సహజమైన సన్నివేశాలతో, భావోద్వేగమైన నటనతో దండు పాళ్యం చిత్రాలు క్రేజ్ సంపాదించుకున్నాయి.