రవితేజ మూడో హీరోయిన్ దొరికేసింది
- IndiaGlitz, [Tuesday,July 09 2019]
'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న చిత్రం 'డిస్కోరాజా'. వి.ఐ.ఆనంద్ దర్శకుడు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్. ఇప్పటికే నభా నటేశ్, పాయల్ రాజ్పుత్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. కాగా లేటెస్ట్గా మూడో హీరోయిన్ ఓకే అయ్యిందట. సమాచారం ప్రకారం 'పటేల్సార్', 'అప్పట్లో ఒకడుండేవాడు' ఫేమ్ తాన్యా హోప్ 'డిస్కోరాజా'లో మూడో హీరోయిన్గా నటించనున్నారు. ఈమె ఈ చిత్రంలో సైంటిస్ట్ పాత్రను పోషిస్తున్నారట. రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోయిన్గా మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న తాన్యాకు రవితేజ 'డిస్కోరాజా' ఏ మేర సాయపడతాడో చూడాలి.