ప్రేక్షకుల కోరిక మేరకు ‘కనులు కనులను దోచాయంటే’ థియేటర్లు పెంచుతున్నాం - కెఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్స్‌

  • IndiaGlitz, [Saturday,March 07 2020]

పెద్ద చిత్రాల నుండి చిన్న చిత్రాల వరకూ... కొన్నేళ్లుగా నిర్మాతలు అనుసరించే సూత్రం ఒక్కటే! వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేసి, తొలి వారంలో వీలైనన్ని వసూళ్లు రాబట్టుకోవాలని చూస్తున్నారంతా!! రెండో వారానికి థియేటర్ల సంఖ్యను తగ్గిస్తున్నారు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు సంఖ్య కూడా తగ్గుతోంది. కానీ, ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా మాత్రం ఈ పరిస్థితికి అతీతమని చెప్పాలి. రెండో వారంలో ఈ సినిమా థియేటర్లు పెరిగాయి.

దుల్కర్‌ సల్మాన్‌, రీతూ వర్మ జంటగా నటించిన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ‘కణ్ణుమ్‌ కణ్ణుమ్‌ కుళ్లయడిత్తా’. తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’గా విడుదలైంది. దేసింగ్‌ పెరియసామి దర్శకుడు. వయోకామ్‌ 18 స్టూడియోస్‌, ఆంటో జోసెఫ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో 'కెఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్స్‌' విడుదల చేసింది. ఫిబ్రవరి 28న విడుదలైన హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతే కాదు, ప్రేక్షకుల డిమాండ్ మేరకు శనివారం నుండి 40 థియేటర్లను పెంచుతున్నట్టు నిర్మాతలు తెలిపారు.

'కెఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్స్‌' నుండి కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ సినిమాకు చక్కటి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల డిమాండ్ మేరకు ఈ రోజు నుండి మేం 40 స్క్రీన్స్ యాడ్ చేశాం. అశేష ప్రేక్షకాదరణతో రెండో వారంలోనూ సినిమా థియేటర్లలో బలంగా నిలబడడమే కాదు, మంచి వసూళ్లను రాబడుతోంది అని అన్నారు.

ఇతర తారాగణం: రక్షణ్, నిరంజని అహతియాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు

More News

‘హిట్’ సినిమా చూసి హానెస్ట్ థ్రిల్లర్ చేశానని ప్రేక్ష‌కులు న‌మ్మారు.. ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా నా బాధ్య‌త‌గా మ‌రింత పెరిగింది: డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై `ఫ‌ల‌క్‌నుమాదాస్` వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో 'ఎంటర్ ది గర్ల్ డ్రాగన్' షెడ్యూల్ పూర్తి...

ఒకప్పుడు బ్రూస్లీ నటించిన హాలీవుడ్ చిత్రం ఎంటర్ ది డ్రాగన్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ నెల 13న రిలీజ్ అవుతున్న 'యురేక' అందరికీ నచ్చుతుంది - నిర్మాత బెక్కం వేణుగోపాల్

ఇంజనీరింగ్ కాలేజ్ ఫెస్ట్ నేపథ్యంలో కార్తీక్ ఆనంద్,డింపుల్ హయతి, సయ్యద్ సోహైల్ రియాన్, షాలిని, ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'యురేక'..

ప‌వ‌న్ స‌ర్‌ప్రైజ్ రేపే

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ టైటిల్ పాత్ర‌లో శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడిగా రూపొందుతోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. బోనీకపూర్ సమర్పణలో

‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’ చిత్రంలో ‘నింగి చుట్టే మేఘం ..’ పాట విడుదల

తెలుగు సినిమా స్థాయిని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం `బాహుబ‌లి`. తెలుగు సినిమా ప్రేక్ష‌కులు గ‌ర్వ‌ప‌డే ఈ గొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని.