Telangana BJP candidates:తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. సీఎం కేసీఆర్‌పై ఈటల పోటీ

  • IndiaGlitz, [Sunday,October 22 2023]

ఎట్టకేలకు తెలంగాణ బీజేపీ తొలి జాబితా విడుదలైంది. 52 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ అధిష్ఠానం విడుదల చేసింది. సీఎం కేసీఆర్‌పై గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో పోటీ రసవ్తరంగా ఉండనుంది. అలాగే హుజూరాబాద్ నుంచి కూడా ఈటల బరిలో నిలవనున్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్‌లకు టికెట్ దక్కింది. ఇక సస్పెన్షన్ ఎత్తివేయడంతో గోషామహల్ నుంచి రాజాసింగ్‌కు సీటు లభించింది. కొన్ని రోజులుగా ఢిల్లీలో మేథోమథనం అనంతరం బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఎక్కువ స్థానాలు బీసీలకు కేటాయించారు.

బీజేపీ తొలి జాబితాలో అభర్థులు వీరే..

హుుజురాబాద్ - ఈటల రాజేందర్
గజ్వేల్ - ఈటల రాజేందర్
కరీంనగర్ - బండి సంజయ్ కుమార్
కోరుట్ల - ధర్మపురి అర్వింద్
పటాన్ చెరు - నందీశ్వర్ గౌడ్
దుబ్బాక - రఘునందన్ రావు
కుత్బుల్లాపూర్ - కూన శ్రీశైలం గౌడ్
ఇబ్రహీంపట్నం - నోముల దయానంద్ గౌడ్
మహేశ్వరం - అందెల శ్రీరాములు యాదవ్
ఖైరతాబాద్ - చింతల రామచంద్రారెడ్డి
కార్వాన్ - అమర్ సింగ్
గోషామహల్ - రాజాసింగ్
సిర్పూర్ - పాల్వాయి హరీశ్ బాబు
బెల్లంపల్లి (ఎస్సీ) - అమరాజుల శ్రీదేవి
ఖానాపూర్ (ఎస్టీ) - రమేశ్ రాథోడ్
ఆదిలాబాద్ - పాయల్ శంకర్
బోథ్(ఎస్టీ) - బాపూరావ్
నిర్మల్ - మహేశ్వర్ రెడ్డి
ముథోల్ - రామరావు పటేల్
ఆర్మూర్ - రాకేశ్ రెడ్డి
జుక్కల్ (ఎస్సీ) - టి. అరుణతార
కామారెడ్డి - వెంకటరమణారెడ్డి
నిజామాబాద్ అర్బన్ - సూర్యనారాయణ గుప్తా
బాల్కొండ - అన్నపూర్ణమ్మ
జగిత్యాల - బోగా శ్రావణి
నాగార్జున సాగర్ - నివేదితా రెడ్డి
సూర్యాపేట - సంకినేని వెంకటేశ్వరరావు
భువనగిరి - గూడురు నారాయణ రెడ్డి
ధర్మపురి(ఎస్సీ) - ఎస్ కుమార్
రామగుండం - సంధ్యారాణి
చొప్పదండి(ఎస్సీ) - బొడిగే శోభ
సిరిసిల్ల - రాణి రుద్రమ రెడ్డి
మానకొండూరు (ఎస్సీ) - ఆరెపల్లి మోహన్
నర్సాపూర్ - ఎర్రగొల్ల మురళీ యాదవ్
చార్మినార్ - మేఘారాణి
చంద్రాయణగుట్ట - సత్యనారాయణ ముదిరాజ్
యాకుత్ పుర- వీరేందర్ యాదవ్
బహుదూర్ పుర - వై నరేశ్ కుమార్
కల్వకుర్తి - టి. ఆచారి
కొల్లాపూర్ - సుధాకార్ రావు